1st Day Of Numaish షేర్ చేయండి హైదరాబాదీ ప్రజలు ఎప్పుడుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ 2025 జనవరి 3వ తేదీన ప్రారంభం అయింది 84వ అఖిలభారత వాణిప్య ప్రదర్శనను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత డి హనుమంతురావు ప్రారంభించారు మొదటి రోజు కావడంతో ఇంకా చాలా స్టాల్స్ పూర్తిగా ఏర్పాటు కాలేదు. ఇంకా చాలా స్టాల్స్లో లైటింగ్ కూడా ఏర్పాటు కాలేదు కొన్ని స్టాల్స్ ముందు జనం కనిపించడం మొదలుపెట్టారు. మొదటి రోజు ప్రతీ సంవత్సరం ఇలాగే ఉంటుంది..తరువాత ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఈ ఏడాది మొత్తం 1500 స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో చిన్న పిల్లలను అలరించేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్లో పెద్దలు షాపింగ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం జయంట్ వీల్, ఇతర యాక్టివిటీస్ సిద్ఢం అయ్యాయి. అయితే తొలి రోజు కావడంతో పిల్లల సందడి కనిపించలేదు. ఈ సారి నుమాయిష్ ఎంట్రీ ఫీజును పెంచి రూ.50 చేశారు. గత ఏడాది ఇది రూ.40 గా ఉంది. Aperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 101Orientation: 1 స్టాల్స్ అన్నీ పూర్తితా సిద్దం అయ్యేందుకు ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. తరువాత జనం పెరుగుతారు. ఈ సారి 25 లక్షల మంది సందర్శించే అవకాశం ఉంది. Aperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 100Orientation: 1 ఈ శనివారం నుంచి సందర్శకులు తాకిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తం 45 రోజులు నుమాయిష్ సందర్శకులతో కిటకిటలాడుతుంది. షేర్ చేయండి