ఇక మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకం ఈవీ జిప్ ఇషా ( EV Zip Eesha ) పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెహికల్స్ పేరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ నుంచి మల్కాజ్గిరి, సైనిక్ పురి, ఈసీఎల్ వంటి ప్రాంతాల మధ్య సేవలు అందిస్తుున్నాయి. త్వరలో వీటిని ఇతర ప్రాంతాలకు , మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని తెలిపారు.