Maha Kumbh Mela View : రాత్రి వేళలో కుంభ మేళా వైభవాన్ని చూపించిన ప్రయాణికుడు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.