Tiruchanur Teppotsavam : తిరుచానూరులో ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
Tiruchanur Teppotsavam: తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 29వ తేదీన ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవం చివరి రోజున శ్రీ పద్మావతి అమ్మవారు అలంకరించిన తెప్పపై పద్మసరోవరంలో ఏడు ప్రదక్షిణలు చేస్తూ వేలాది మంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
