Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్
Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్ఢా నుంచి కశ్మీర్కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.