Strange Place : హైదరాబాద్లో ఓ వింత ప్రదేశం.. ఒక్క మాట పదిసార్లు ప్రతిధ్వనిస్తుంది.. ఎప్పుడైనా వెళ్లారా?
Strange Place : ప్రపంచంలోనే కొన్ని విచిత్రమైన, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని చారిత్రక అంశాలతో, కొన్ని ఆధ్యాత్మిక అంశాలతో ఆకర్షిస్తుంటాయి. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఒక వింత అనుభూతిని ఇచ్చే ప్రదేశం హైదరాబాద్కు సమీపంలో ఉంది. ‘ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ అనే రజనీకాంత్ బాషా సినిమా డైలాగ్ తరహాలో ఇక్కడ మనం చేసిన శబ్దం పది రెట్లు ప్రతిధ్వనిస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మశక్యం కాని ఈ అద్భుతం ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ సమీపంలో వింత ప్రదేశం
ప్రకృతిలో చాలా అద్భుతాలు దాగి ఉంటాయి. అలాంటి అరుదైన, ప్రత్యేకమైన ప్రదేశం హైదరాబాద్కు దగ్గరగా రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం పరిధిలోని కన్హా శాంతివనం (Kanha Shantivanam) లో ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిర్మాణం వద్ద మనం చేసే శబ్దం పది రెట్లు ప్రతిధ్వనించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రదేశంలో కేంద్రంగా నిలబడి మనం ఏదైనా శబ్దం చేసినప్పుడు, ఆ శబ్దం పదిసార్లు మన చెవుల్లోనే రిపీట్ అవుతున్నట్లుగా (ప్రతిధ్వనిస్తున్నట్లు) అనిపిస్తుంది. మన చెవుల్లో ఎవరైనా మాట్లాడుతున్నారా అనే వింత అనుభూతిని ఇది ఇస్తుంది. బుద్ధుడి విగ్రహాన్ని కేంద్రంగా ఉంచి, దాని చుట్టూ చక్రాల ఆకారంలో గీతలు లేదా నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ అద్భుతం జరుగుతుందని అక్కడి వారు చెబుతున్నారు. చెట్ల అమరిక, గాలి, శక్తి వల్ల ఈ నిర్మాణం అద్భుతాన్ని సృష్టిస్తోంది.

కన్హా శాంతివనం విశేషాలు
కన్హా శాంతివనం కేవలం శబ్ద ప్రతిధ్వనికి మాత్రమే కాదు, మొత్తం 1,400 ఎకరాల్లో విస్తరించి అనేక అద్భుతాలకు నెలవుగా మారింది. ఇది హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి 11 కి.మీ దూరంలో లేదా నగరం నుంచి సుమారు 50 కి.మీ దూరంలో ఉంది. ఒకప్పుడు కరువుతో, రాళ్లతో, బంజరుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు దట్టమైన పచ్చని చెట్లతో నిండిపోయింది. ఇక్కడ వివిధ రకాల పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలు కూడా ఉన్నాయి.
లక్షల చెట్ల అద్భుత ప్రయాణం
కన్హా శాంతివనంలో లక్షల సంఖ్యలో ఉన్న పచ్చని చెట్ల వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ వనంలో ఉన్న చెట్లన్నీ సహజంగా ఇక్కడే పెరిగినవి కావు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించబడిన అనేక వందల భారీ వృక్షాలను లక్షల ఖర్చుతో ఇక్కడికి తీసుకువచ్చి నాటారు. తమిళనాడు-కేరళ హైవే విస్తరణలో ప్రభుత్వానికి చెందిన కొబ్బరి చెట్లను తొలగించినప్పుడు, వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి నాటారని అక్కడి వారు చెబుతున్నారు. ఒక బంజరు భూమిని ఇంతటి అద్భుతమైన పచ్చదనంతో కూడిన కేంద్రంగా మార్చడం నిజంగా గొప్ప విషయం.
సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ
ఈ వింత ఎకో అనుభూతిని పొందడానికి ఎక్కువ మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ప్రతిరోజు అనేక మంది సందర్శకులు ఈ స్థలాన్ని సందర్శించి, ఆ ప్రతిధ్వని అనుభవాన్ని పొందుతున్నారు. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి ఈ స్థలం ప్రధాన గమ్యస్థానంగా మారింది.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
