చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.
ముఖ్యాంశాలు
హిమాలయాల్లోని అద్బుతమైన తీర్థయాత్రలో ఆధ్యాత్మిక చైతన్యం పొందడంతో పాటు భక్తులకు అక్కడి ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
- ఇది కూడా చదవండి : Hemkund Sahib : ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార
ఈ ప్యాకేజి హైలైట్స్ | Package Highlights
- యాత్ర ప్రారంభం అయ్యే ప్రాంతం : ఢిల్లీ
- కవర్ అయ్యే క్షేత్రాలు : యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్
- ప్రయాణ మాధ్యమం : రోడ్డు మార్గంలో (ఏసి వెహికల్)
- గ్రూప్ సైజు : మ్యాగ్జిమం 20 మంది ప్రయాణికులు
- వసతి : డిలక్స్ కేటగిరి హోటల్స్, రిసార్టులు
- సమయం : 11 రాత్రులు / 12 పగలు
- ప్రయాణ తేదీలు : మే లో ప్రారంభం అవుతుంది (ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి)
ప్రయాణం సాగేదిలా | Itinerary IRCTC Tourism

- మొదటి రోజు : ఢిల్లీ నుంచి హరిద్వార్ (Haridwar), సాయంత్రం చెకిన్, డిన్నర్
- 2వ రోజు : బార్కోట్ (Barkot) , ఓవర్ నైట్ స్టే
- 3వ రోజు : జానకి చట్టి నుంచి యమునోత్రి ఆలయానికి ట్రెక్ ( ఇది 6 కిమీ ట్రెక్, గుర్రం, పల్లకి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాల్సి ఉంటుంది). తరువాత బార్కోట్కు తిరిగి రావాల్సి ఉంటుంది.
- 4వ రోజు : ఉత్తరకాశికి (Uttarkashi) ప్రయాణం, కాశీ విశ్వనాథుడి దర్శనం, రాత్రి బస
- 5వ రోజు : 3050 మీటర్ల ఎత్తులో ఉన్న గంగోత్రి ఆలయానికి ఎక్స్కర్షన్, ఇక్కడే గంగా నది జన్మించే ప్రదేశం ఉంటుంది. తరువాత ఉత్తర కాశికి చేరుకుంటారు.
- 6వ తేది : గుప్తకాశి (Guptkashi) / సీతాపూర్ చేరుకుని రాత్రి అక్కడే బస చేయడం.
- 7వ తేది : ఉదయం సోన్ప్రయాగ్కు బయల్దేరి అక్కడి నుంచి 16 ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి చేరుకోవడం. పోని, పాల్కి సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి చార్జీలు ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. సాయంత్రం హారతి తరువాత రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
- 8వ తేది : ఉదయం దర్శనం ( కేదార్నాథ్లో), అభిషేకం తరువాత గౌరికుండ్ ( Gaurikund) వరకు డిసెండింగ్ చేయడం (కిందికి దిగడం). అనంతరం గుప్తకాశి / సీతాపూర్కు చేరుకోవడం.
- 9 రోజు : జోషిమఠ్లోని నరసింహ స్వామి (Joshimath) ఆలయ దర్శనం అనంతరం బద్రినాథ్ (Badrinath) వైపు చేరుకోవడం. సాయంత్రం దర్శనం చేసుకుని రాత్రి అక్కడే బస చేయడం.
- 10వ రోజు : ఉదయం పవిత్రమైన వేడి నీటి గుండం తప్తకుండ్లో (Tapt Kund) లో పవిత్ర స్నానం చేసి దర్శనం.

అనంతరం భారత్లో చివరి గ్రామం అయిన మానాకు (Mana Village) వెళ్లడం. తరువాత రుద్రప్రయాగ్ (Rudraprayag) చేరుకుని అక్కడే రాత్రి బస చేయడం.
- 11వ రోజు : హరిద్వార్ చేరుకోవడడం. మానసా దేవి (Mansa Devi), చండి దేవి ఆలయాలను (Chandi Devi Temple Haridwar) దర్శించుకుని, హరికి పౌరి (Har Ki Pauri) వద్ద గంగాహరతిని వీక్షించాక రాత్రి హరిద్వార్లోని ఒక హోటల్లో బస చేయడం.
- 12 రోజు : డిల్లికి బయల్దేరడం, ఐఆర్సీటీసికి చెందిన జింజర్ రైల్ యాత్రి నివాస్ వద్ద ఈ యాత్రం ముగుస్తుంది.
ఈ ప్యాకేజి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
- డీలక్స్ హోటల్స్లో వసతి, బ్రేక్ఫాస్ట్, డిన్నర్
- ఏసీ కోచ్లో రవాణా ( IRCTC Tourism)
- ఐఆర్సీటీసి టూర్ మేనేజర్ / కొవార్డినేటర్ సేవలు.
- ఇక కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలకు చేరుకునేందుకు పల్లకి, పోని ( కంచెర గాడిద) సేవలు ఉపయోగించకుంటే వాటి చార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Char Dham Yatra 2025 : ఛార్ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్
- ప్రయాణికులు తమతో పాటు ఐడీ కార్డులను తప్పనిసరిగ్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. 11 ఏళ్లు పైబడిన పిల్లల చార్జీలు పెద్దలకు సమానంగా ఉంటాయి.
- ప్రయాణికులు (Travelers) తమతో పాటు తమ మెడిసిన్ను, చలి దుస్తువులను, వ్యక్తిగత సామాన్లను క్యారీ చేయాల్సి ఉంటుంది.
- బఫే అనేది కొన్ని వేదికల్లో మాత్రే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకే మెన్యూ పలుమార్లు రిపీట్ అవ్వవచ్చు.
ప్యాకేజి ధరలు | Package Tariff
బుకింగ్, ప్యాకేజి ధరలు, మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేసి ఐఆర్సీటిసి వెబ్సైట్ను విజిట్ చేయండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.