భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది.
ముఖ్యాంశాలు
సుమారు 17 లక్షల 76 వేల మంది భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్లోని హిమాయాల్లో ఉన్న ఈ పరమపవిత్ర యాత్రకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- ఇది కూడా చదవండి : Vasudhara Falls : ఈ జలపాతం నీరు పాపులపై పడదు
చార్ ధామ్ యాత్ర అంటే ఏంటి ? What Is Char Dham Yatra 2025
ఛార్ ధామ్ యాత్ర అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలు అయిన గంగోత్రి (Gangotri), యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలకు చేసే ఆధ్యాత్మిక యాత్ర. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయ్ (Garhwal Himalayas) ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇందులో ప్రతీ పుణ్య క్షేత్రానికి ఆధ్యాత్మిక విశిష్టత ఉంది.
- యమునోత్రి (Yamunotri) : యమునా దేవికి అంకితమైన క్షేత్రం
- గంగోత్రి : పవిత్ర గంగమ్మకు అంకితమైన ఆలయం
- కేదార్నాథ్ : మహాశివుడి మహిమగల పుణ్యక్షేత్రం
- బద్రినాథ్ : నారయణుడు బద్రినాథుడిగా దర్శనం ఇచ్చే ఆలయం.
ఈ పవిత్ర క్షేత్రాల సందర్శన వల్ల ఆత్మఙ్ఞానం కలిగి పవిత్రంగా మారుతుంది అని, మోక్షానికి (Salvation) మార్గం లభిస్తుందని భావిస్తారు. అని చాలా మంది జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలని భావిస్తారు.
చార్ ధామ్ పుణ్య క్షేత్రాలు తెరుచుకునే తేదీలు
Char Dham Temple Opening Dates : చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ముందుగా గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రధాన తలుపులు తెరుచుకుంటాయి. మే 4వ తేదీన బద్రినాథ్ ఆలయాన్ని, మే 2వ తేదీన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం తలుపులు తెరుస్తారు.
- ఇది కూడా చదవండి : Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…మీ అధ్యాత్మిక యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి !
ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార హేంకుండ్ సాహిబ్ (Hemkund Sahib Gurudwara) ద్వారాలు మే 25వ తేదీన తెరుచుకోనున్నాయి. హేంకుండ్ సాహిబ్ గురుద్వారకు నేను ట్రెక్కింగ్ చేశాను ఇక్కడ నేను అత్యంత పవిత్రమైన బ్రహ్మ కమలాన్ని (Brahmakamal) చూశాను. ఆ వీడియోను చూడండి. చాలా బాగుంటుంది.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ? | Char Dham Yatra 2025
Registration Process : చార్ ధామ్ యాత్రకు వెళ్లాలి అనుకునే భక్తులు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం యాత్రికులు ఉత్తరాఖండ్ (Uttarakhand) చార్ ధామ్ యాత్ర పోర్టల్కు లాగిన్ అవ్వవచ్చు. లేదా హరిద్వార్, రిషికేష్ (Rishikesh) లేదా బేస్ పాయింట్స్ వద్ద ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
దీని కోసం కావాల్సినవి
- ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు
- ఫోటోగ్రాఫ్
- దీంతో పాటు హెల్త్ చెకప్ కూడా చేసుకోవాల్సి రావచ్చు.
ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య
చార్ ధామ్ యాత్రకు ఏటేటా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2024 బద్రినాథ్ (Badrinath), కేదార్నాథ్, ఆలయాలకు 30 లక్షల మంది భక్తులు తరలివెళ్లారు. ఇక 2025 లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.