ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025) వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు.
ముఖ్యాంశాలు
అది కైలాష్తో పాటు ఓం పర్వత్ దర్శనం కోసం భక్తులు, సాహసయాత్రికులు ప్రతీ ఏడాది ఈ యాత్రను చేపడతారు. అందమైన హిమాలయ పర్వతాలు, లోయల్లో జరిగే ఈ యాత్ర చాలా అందంగా ఉంటుంది.
యాత్ర వివరాలు | Details and Permits Required
ఉత్తరాఖండ్లోని పితోడ్గడ్ జిల్లాలో బ్యాస్ వ్యాలీలో (Byas Valley) 14,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆది కైలాష్ పర్వతం. ఈ యాత్రకు వెళ్లేందుకు కావాల్సిన ఇన్నర్లైన్ పర్మిట్ను (inner Line Permit ILP) డ్రాచులా (Drachula) లోని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ కార్యాలయం జారీ చేస్తుంది.
ఐఎల్పి ఎందుకు? | Is ILP Is Required ?
ఈ ఐఎల్పి వల్ల హిమాలయాల వంటి కఠినమైన పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో పర్యాటకుల భద్రత కోసం సరైన ఏర్పాట్లు చేయడం, భక్తుల రాకపోకలను క్రమబద్దీకరించడం సులభం అవుతుంది. ఈ సారి బాగా మంచు కురవడంతో ఇన్నర్ లైన్ పర్మిట్ను వ్యవధిని కేవలం 4 రోజులకే పరిమితం చేశారు.
జోలింగ్కాంగ్లో పూజతో ప్రారంభం
ఆది కైలాష్ యాత్రను 2025వ తేదీన జోలింగ్కాంగ్ (Jolingkong) లో ఉన్న మహా శివుడి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ పూజలను స్థానికంగా ఉండే రూంగ్ కమ్యూనిటీ (Rung Community) ప్రజలు ప్రారంభిస్తారు. వీరు పూజలు నిర్వహించిన తరువాత ఓం పర్వత్ (Om Parvat ), పార్వతి కుండ్ తీర్థ యాత్ర ప్రారంభం అవుతుంది.
1,000 మంది లక్కీ భక్తులకే అవకాశం
కఠినమైన హిమాలయాల్లో (Himalayas) సాగే ఈ యాత్ర విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతీ రోజు 1,000 మంది మాత్రమే ఓం పర్వత్ లేదా ఆది కైలాష్ యాత్రకు అనుమతి ఇస్తారు.
- కుమావ్ మండల్ వికాస్ నిగం (KMVN) ఇక్కడ భక్తుల కోసం హోం స్టేలను, హోటళ్లను, రెస్ట్ హౌజులను ఏర్పాటు చేస్తుంది.
- ఇవి మీకు కుటి, నబి, నేపాలచ్చు, జోలింగ్కాంగ్ వంటి గ్రామాల్లో అందుబాటులో ఉంటాయి.
- పార్వతి కుండ్, జోలింగ్కాంగ్ మధ్యలో జీప్ సర్వీస్ (Jeep Service) కూడా అందుబాటులో ఉంటుంది. వీటి ధరను టూరిజం శాఖ స్థానిక ట్యాక్సీ యజమానులతో కలిసి నిర్ణయిస్తుంది.
- దీంతో పాటు ఇక్క గుర్రాలు, కంచర గాడిదలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి | Important Permit Requirements
అది కైలాష్ యాత్రకు వెళ్లాలి అనుకునే భక్తులు, యాత్రికులు తప్పనిసరిగా తమతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది:
- ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్ (Voter Card, Aadhaar Card ETC)
- కొన్ని పాస్పోర్టు సైజ్ ఫోటోలు
- రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ జారీ చేసిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ (50 ఏళ్లు పైబడినవారికి ఇది తప్పనిసరి)
- దీంతో పాటు యాత్రకు అవసరం అయ్యే నోటోరైజ్జ్ ఎఫిడెవిట్
- పోలిస్ వెరిఫికేష్ అవసరం కూడా ఉండొచ్చు. అయితే పాస్పోర్టు ఉంటే పోలిస్ వెరిఫికేషన్ అవసరం పడకపోవచ్చు.
- మీ వద్ద ఉన్న పర్మిట్ పత్రాలను ఒకటికన్నా ఎక్కువ చోట్ల చెక్ చేస్తారు. అందుకే యాత్ర పర్మిట్తో పాటు ఐడి కార్డులను మీతో పాటు నిత్యం క్యారీ చేయండి.
పెరిగిన యాత్రికుల సంఖ్య | Adi Kailash Yatra 2025
ప్రతీ సంవత్సరం సుమారు 30,000 వేల మంది యాత్రికులు ఆదికైలాష్ యాత్ర చేపడతారు. ఆది కైలాష్ యాత్రకు పాపులారిటీ బాగా పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ఆ సంఖ్య 50,000 చేరుకునే అవకాశం ఉంది. ఒక వేళ మీరు కూడా ఈ యాత్రకు వెళ్లాలి అనుకుంటే మాత్రం ఏప్రిల్ 30 నుంచి ఐఎల్పి జారీ ప్రక్రియ మొదలవుతుంది. గుర్తుంచుకుని ప్లాన్ చేసుకోండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.