భారత్లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.
అయితే ఒక ఫ్రెంచ్ యూట్యూబర్ ఇటీవలే ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన తరువాత ఇంకా చాలా విషయాలు మారాలి అనిపిస్తుంది.
ముఖ్యాంశాలు
మీరేం చేస్తారు ?
మీరు వేరే దేశంలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. మీరు ప్రయాణిస్తున్న ట్రైన్లో ఎలుక తిరుగుతోంటే మీకు ఎలా అనిపిస్తుంది ? మీ బెడ్ దగ్గర బొద్దింక తిరిగితే ? వాష్రూమ్కు వెళ్లి వచ్చేలోగా మీ సీటుపై ఇద్దరు లేడీస్ కూర్చుంటే వారిని లేపగలరా ?

రూ. 150 లంచ్ ఆర్డర్ కోసం మీరు రూ.200 ఇస్తే మిగితా రూ.50 తరువాత ఇస్తానని క్యాటరింగ్ సిబ్బంది మాయమైతే ఎలా అనిపిస్తుంది ?…ఇవన్నీ యూరోప్కు (Europe) చెందిన ఒక యూట్యూబర్ ఇటీవలే భారత్లో అనుభవించిన మనకు చిన్నగా అనిపించే పెద్ద విషయాలు.
46 గంటల ప్రయాణం | Indian Train Journey
ఇండియన్ రైల్వేలో (Indian Railways) ప్రయాణం గురించి ఫ్రెంచ్ యూట్యూబర్ విక్టర్ బ్లాహో (Victor Blaho) ఒక వీడియోలో షేర్ చేశాడు. ముంబై నుంచి వారణాసి, ఆగ్రా, ఢిల్లీకి 46 గంటల పాటు ట్రైను ప్రయాణం విక్టర్ను ఎంతగా ఇరిటేట్ చేసిందంటే అతను మళ్లీ ఇలాంటి ప్రయాణం చేయనన్నాడు.
స్లీపర్ క్లాసులో ప్రయాణం
మూడు వారాల్లో భారత్ పర్యాటించాలని వచ్చిన ఫ్రెంచ్ పౌరుడు తన చాలా సింపుల్ ప్లాన్ వేశాడు. భారతీయ రైల్వే గురించి తెలుసుకోవాలి అనుకుంటే అందులోని అన్ని రకాల క్లాసుల్లో ప్రయాణించాలి అనుకున్నాడు. స్లీపర్ నుంచి ఏసి వరకు అన్ని కవర్ చేద్దాం అనుకున్నాడు. తొలూత అందమైన సీన్స్ చూసి, డిఫరెంట్ కల్చర్ గురించి తెలుసుకుని సంబరపడ్డాడు విక్టర్.
- తరువాత అతను ప్రయాణిస్తున్న రైలులో రద్దీ పెరగడం, విపరీతమైన శబ్దాలు, గందరగోళంగా ఉన్న వాతావరణం అతడిని ఇబ్బంది పెట్టింది.

నిద్రలేని రాత్రులు
Indian Train Journey : భారతీయ రైల్వేపై మొదట్లో ఉన్న ఇంప్రెషన్ కొద్ది సమయంలోనే మాయమైంది. ఎందుకంటే అతను ప్రయాణిస్తున్న కోచులో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పడి ఉండటం, తన సీటు ముందే ఎలుక తిరగడం, అతని బెడ్ పక్కన ఒక బొద్దింక తిరుగుతూ కనిపించాయి. దాంతో పాటు కోచులో దుర్వాసన కూడా తోడైంది.
ఇక రాత్రి సమయంలో కూడా ప్రయాణికులు మాట్లాడుకోవడం, జనాలు అటూ ఇటూ తిరగడం వల్ల నిద్రపోలేకపోయానంటాడు విక్టర్.
చనువిస్తే చంకనెక్కాడు | Co-Passenger In Train
ఈ ప్రయాణంలో విక్టర్కు ఒక తోటి ప్రయాణికుడు పరిచయం అయ్యాడు. తన గర్ల్ఫ్రెండ్కు తన గురించి మంచి విషయాలు చెప్పమని అది వీడియో తీస్తానని రికార్డు చేస్తాడు ఈ కొత్త వ్యక్తి. దీంతో పాటు తను చాలా మంచి వాడిని అంటూనే ముంబై, ఢిల్లీలో ఇద్దరు గర్ల్ఫ్రెండ్ ఉన్నారని అంటాడు.
అంతేనా తన గాళ్ఫ్రెండ్స్తో వీడియో కాల్లో మాట్లాడిస్తాడు. ఈ సమయంలో తన గాళ్ఫ్రెండ్ గురించి ఎక్కువ ఆలోచిస్తే చంపేస్తాను అని సరదాగా అంటాడు ఆ తోటి ప్రయాణికుడు (Prayanikudu). (ఆ ప్రయాణికుడు నేను కాదు)
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
జస్ట్ ఇమాజిన్ ఒక కొత్త దేశంలో అప్పుడే పరిచయం అయిన వ్యక్తి , సరదా కోసం అయినా చంపేస్తాను అంటే మీకు ఎలా అనిపిస్తుంది. ఇదంతా విక్టర్ను బాగా డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుంది.
అందుకే…
ఎవరైనా భారత్కు (India) వస్తే ఏం చేయాలి ? ఎలా ప్రయాణించాలో తన మూడు వారాల అనుభవాన్ని బట్టి కొన్ని టిప్స్ ఇచ్చాడు విక్టర్. దానికన్నా ముందు “నేను ఇంటికి వెళ్లాలి…నాకు ప్రశాంతత కావాలి, నాకు మంచి క్లీన్ బెడ్ కావాలి “ అంటూ తన పరిస్థితి గురించి చెప్పకనే చెప్పాడు.
ఇక 46 గంటల పాటు లోయెస్ట్ ట్రెయిన్ క్లాసులో ప్రయాణించిన తరువాత చాలా గందరగోళానికి గురయ్యాను అని చెప్పాడు. అందుకే డబ్బు ఉంటే హై క్లాస్ టికెట్, మంచి హోటల్లో ఉండేందుకు ప్రయత్నించండి అంటాడు. అంతే కాదు ఈ సారి ఇండియా వస్తే హైక్లాస్లో ప్రయాణిస్తానంటాడు.
మొత్తనికి…
ప్రతీ రోజు 3 కోట్ల మంది ప్రయాణించే ఒక రవాణా వ్యవస్థను (Transport System) నిర్వహించడం అనేది పెను సవాళ్లతో కూడుకున్నది. కొన్ని దేశాల జనాభా కన్నా ఈ సంఖ్య ఎక్కువ అని గమనించండి.
అయితే ఇందులో తప్పు ఎవరిది ? ఎవరిది కాదు ? అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎలుకలు, బొద్దింకలు బోగీలో తిరుగుతున్న విషయం విక్టర్ లాంటి విదేశీయుడు చెప్పే వరకు రైల్వే శాఖకు తెలియదా ?
అలాగే ఆహార పదార్ధాలు, ప్యాకెెట్లను, కప్పులను పడేయడానికి టాయ్లెట్ పక్కనే ఒక డస్ట్ బిన్ ఉంటుంది అని…పోని అది నిండిపోతే ఒక కవర్లో వేసి ఆ కవర్ను ట్రైన్ నుంచి దిగినప్పుడు ప్లాట్ఫామ్పై ఉన్న చెత్త డబ్బాలో వేయాలని ప్రయాణికులకు తెలియదా ?
రైలు బోగిని నీట్గా (Indian Train Journey) ఉంచుకోవాలి అని ప్రయాణికులకు ఎందుకు అనిపించదు ? మనం తిని విసిరేసే సగం తిన్న బిస్కెట్ రైలులోని ఫ్లోరుపై పడితే, అది విక్టర్లాంటి విదేశీయుల కంట పడితే అందులో రైల్వే శాఖ తప్పు ఎంత వరకు ఉందంటారు ?
ఇంత చెత్త పెట్టుకుని క్లీనింగ్ స్టాఫ్ ఏం చేస్తోంది ? అయినా రోజుకు ఎన్నిసార్లు శానిటరీ పర్సన్ వచ్చి క్లీన్ చేయాలి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు మనమే వేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం కూడా రైల్వేలో ప్రయాణిస్తాము కాబట్టి.
మార్పులు వచ్చాయి..కానీ అంతా మారిందా ?
నిజానికి గత పదేళ్లలో రైల్వే శాఖ పనితీరు చాలా మారింది. ప్లాట్ఫామ్ల నుంచి రైల్వే కోచులు, టాయిలెట్స్, ఫుడ్ ఇలా చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. అయితే విక్టర్లాంటి వారికి కలిగిన ఇబ్బందికి కూడా రైల్వే శాఖ పరిష్కారం భవిష్యత్తులో చూపిస్తుంది అని ఆశిద్దాం.
నెంబర్స్ మాట్లాడుతాయి

ఈ విషయంలో భారతీయ రైల్వే నిబద్ధతను మనం ప్రశ్నించలేము. మెరుగైన వసతుల కోసం ప్రయత్నిస్తోంది, రైల్వే స్టేషన్లు ఆధుణీకరించేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
కొత్త బోగీలను రికార్డు స్థాయిలో తయారీ చేస్తోంది.
ఉదాహరణకు : Indian Train Journey
2004-14 మధ్యలో ఏడాదికి యావరేజ్గా 3,300 బోగీలు తయారయ్యేవి. అదే 2014-2024 మధ్య కాలంలో ఏడాదికి సగటున 5,481 బోగీలను తయారు చేశారు. అంటే బోగీల తయారీ సంఖ్య దాదాపు డబుల్ అయింది.
- దీంతో పాటు రానున్న రెండేళ్లలో 10,000 నాన్ ఏసీ కోచెస్ తయారు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది రైల్వే శాఖ.
- May be, మరో పదేళ్ల తరువాత ఆ ఎలుకలు, ఆ బొద్దింకలు కనిపించవేమో…విక్టర్కు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయిన క్యాటరింగ్ సిబ్బంది…భవిష్యత్తలో ప్రయాణికులకు డబ్బు తిరిగిచేస్తాడేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.