భారత్ అంటే ఏంటో భారత్కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.
ముఖ్యాంశాలు
భారత్ వేగం…విదేశాలు ఆగం
గత 10 ఏళ్లలో భారతీయ రైల్వేలో (Indian Railways) చాలా మార్పులు వచ్చాయి. ఈ సానుకూల మార్పుల్లో ఫుడ్ సర్వీస్ కూడా ఒకటి. ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్లో ఉన్న హోటల్స్ అండ్ స్టాల్స్ వద్ద తినడం లేదా పార్సిల్ చేసుకునేవాళ్లు చాలా మంది ప్రయాణికులు. దీంతో పాటు రైల్వే క్యాటరింగ్ సిబ్బందికి ఫుడ్ ఆర్డర్ ఇస్తే కూడా ఫుడ్ వచ్చేది.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
అయితే ఆ మెన్యూలో ఉన్నది కాకుండా ఇంకేదైనా కావాలి అనుకుంటే ? మీరు చేయాల్సిందల్లా ఫుడ్ బుకింగ్ యాప్ లేదా రైల్వే యాప్ (Railway App) ద్వారా మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వడమే. మనం చెప్పే అవసరం కూడా లేకుండా జస్ట్ పీఎన్నార్ నెంబర్ను (PNT Number) బట్టి ట్రాక్ చేసుకుని మీరు స్టేషన్కు వచ్చే సమయానికి, డిలవరీ చేసే వ్యక్తి మీకోసం ఫుడ్ తీసుకుని వెయిట్ చేస్తుంటాడు.
ఇక ప్రైవేట్ హోటల్స్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే మీరు ఏ టైమ్ వరకు మీకు ఫుడ్ అందాల్సిన స్టేషన్కు వస్తున్నారో ఏ ప్లాట్ఫామ్ వస్తున్నారో చెబితే మీరు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మీ వద్దకు వస్తుంది.ఇది మనలో చాలా మందికి తెలిసిన విషయమే. మనలో ఎంతో మంది ఈ సేవలను వినియోగించుకుంటూ ఉంటాం.
సీటు వద్దకు శాండ్విచ్ | On-Train Food Delivery
జార్జ్ బక్లీ అయే బ్రిటిష్ యూట్యూబర్కు (YouTuber) మాత్రం ఇలాంటి ఒక వ్యవస్థ భారత్లో ఉంది అని తెలియదు. అందుకే అతను ప్రయాణిస్తున్న బోగిలో తన సీటు వద్దకు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చే సరికి పాత యూట్యూబ్ థంబ్నెయిల్స్ చెప్పినట్టు “ అవాక్కయ్యాడు”.
ట్రైన్లో కాశీకి (Kashi) వెళ్తున్న సమయంలో బక్లీ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అతడి వద్దకు చేరింది. ఈ విషయాన్ని తన ట్రావెల్ కమ్యూనిటీతో షేర్ చేసుకున్నాడు. కాన్పూర్ స్టేషన్కు చేరుకునే కొన్ని గంటల ముందే జొమాటో (Zomato) నుంచి శాండ్విచ్, మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాడు బక్లి.
After Few Hours Later….
కాన్పూర్లో ఆగింది రైలు బండి
ఆగగానే డిలివరీ చేస్తే వ్యక్తి వచ్చాడండి.
అవాక్కయిన బక్లి
జేబులోంచి ఫోన్ తీసి
డిగాడు సెల్ఫి
భారత్ నుంచి నేర్చుకోవాలని
ప్రపంచానికి చాటి చెప్పాడు బక్లి
వీడియోలో ఏముంది అంటే..
“భారత్లో ట్రైన్లో సీటు వద్ద ఫుడ్ డిలవరీ చేస్తున్నారు. ఏంటి నమ్మడం లేదా, అయితే ఆగండి” అంటూ ఒక వీడియోను రికార్డు చేసి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో షేర్ చేశాడు. ఏసీ ఫస్ట్క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుని తను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ను ఎంజాయ్ చేసిన బక్లి “యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) ఈ విషయం భారత్ నుంచి నేర్చుకోవాలి అని పోస్ట్ చేశాడు. దీంతో పాటు తనకు ఈ విషయంలో సాయం చేసిన తోటి ప్రయాణికుడికి థ్యాంక్స్ చెప్పాడు.
నెటిజెన్ల రియాక్షన్
బక్లి పోస్ట్ చేసిన ఈ వీడియో కొన్ని రోజుల్లోనే సుమారు 8,00,000 వ్యూస్ ,67,000 లైక్స్ సంపాదించుకుంది. సోషల్ మీడియా సిటిజెన్లు ఈ సందర్భంగా తమ సొంత అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు.
కొంత మంది కొన్ని ఫన్ని సూచనలు కూడా చేశారు.
- అందులో ఒక వ్యక్తి “ అయితే మీకు ట్రైన్లో గుజరాతి ఫ్యామిలి కలిస్తే అప్పుడు తెలిసేది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే అవసరమే లేదు. ఎందుకంటే వారు సంచుల సంచుల కొద్ది ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకొస్తారు. మీరు వద్దన్నా మీకు తినిపిస్తారు “ అని కామెంట్ చేశాడు ఒక వ్యక్తి.
- ఇక మరో వ్యక్తి కామెంట్ చేస్తూ “ బక్లీ, ఇండియాలో, 10 నిమిషాల్లో కిరాణా సరకులు ఉరుకులుగా పరుగులుగా మీ వద్దకు వస్తాయి. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి” అని రాశాడు.
- ఇక రైల్వే టికెట్లను క్యూార్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code
మొత్తానికి బక్లీ అనుభవాన్ని బట్టి భారత్లో డిలివరీ సేవలు (Food Delivery) ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే మెరుగ్గా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. సో ఒక వేళ మీరు విదేశాల్లో ఉంటే ఆ దేశంలో ఇలాంటి సర్వీస్ ఉందా ? ఎప్పుడైనా ట్రై చేశారా ? కామెంట్ చేయండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.