హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Nehru Zoological Park) డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన తెరిచే ఉంటుంది. నిజానికి జూపార్క్ ప్రతీ సోమవారం సందర్శకుల కోసం మూసివేస్తారు.
ముఖ్యాంశాలు
అయితే ఈ సోమవారం మాత్రం ప్రజల సందర్శనార్ధం జూపార్కును తెరిచే ఉంచాలని అటవీ శాఖ (Forest Department) నిర్ణయించింది. ఈ మేరకు సందర్శకులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని జూ క్యూరేటర్ జే వసంత తెలిపారు.
అరుదైన జంతువులకు ఆలవాలం | Nehru Zoological Park
380 ఎకరాల మేరా విస్తరించి ఉన్న జూపార్క్లో 193 రకాల పక్షలు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. హైదరాబాద్ సందర్శనకు (Hyderabad Tour) వచ్చే వారిలో చాలా మంది ఇక్కడి జూపార్క్ చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం పార్కులో ఇండియన్ రైనో, ఆసియా సింహం, బెంగాల్ టైగర్, భారతీయ ఏనుగు వంటి అరుదైన ఎన్నో జంతువులు ఉన్నాయి.
జూపార్క్ సమీపంలోనే 600 ఎకరాల్లో విస్తించి ఉన్న మీర్ ఆలం ట్యాంక్ (Mir Alam Tank) ఉంది. ఇక్కడికి అనేక జాతుల పక్షలు వలసకు వస్తుంటాయి.
పెరిగిన టికెట్ల ధరలు | Nehru Zoological Park Ticket Prices Hike
జూపార్క్కు వెళ్లే సందర్శకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటీవలే వివిధ విభాగాల్లో టికెట్ల ధరలను పెంచారు.
- పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ.50
- జాయ్రైడ్, ఫోటోగ్రఫికి అదనపు సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
- టాయ్ ట్రెయిన్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు.
- స్టిల్ కెెమెరా తీసుకెళ్లాలి అంటే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.