Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.
[Best_Wordpress_Gallery id=”109″ gal_title=”Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం”]మహా కుంభమేళాకు ముందు పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళలో పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కొచ్చిలోని అగస్త్య ముని ఆలయంతో (Agasthya Muni Temple) పాటు, శ్రీ పరుశురాముడి ఆలయం, తమిళనాడులోని స్వామి మలై, మదురై మీనాక్షి అమ్మవారి (Madurai Meenakshi Temple) ఆలయం, కుంభకోణంలోని కుంభేశ్వరుడితో పాటు పలు ఆలయాలను దర్శించుకున్నారు.
ఈ పుణ్య క్షేత్రాల యాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకీరా ( Akira Nandan) నందన్, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి కూడా ఉన్నారు.
