అమర్‌నాథ్ యాత్రికులను Pahalgam Terror Attack ప్రభావితం చేస్తుందా ?

షేర్ చేయండి

పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న. 

ఎందుకంటే అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra 2025) పహల్గాం నుంచే కొనసాగుతుంది. ఇది తెలిసిన తరువాత కూడా తీర్థయాత్రకు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధం అవుతారు? వారికి ధైర్యం కలిగేలా ప్రభుత్వం ఏం చేయనుంది ? ఇలాంటి ఎన్నో విషయాలు, అనేక ప్రశ్నలు పర్యాటకులను, పర్యాటక రంగాన్ని (Kashmir Tourism) తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. 

సెక్యూరిటీ పెంపు | Heightened Security Measure

అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు సురక్షితంగా ఉంచేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. సీఆర్‌పీఎఫ్ (CRPF), ఐటీబీపి (ITBP), ఇతర పారా మిలిటరీ ఫోర్సులు, పోలీసులు ఇలా వేలాది సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.

  • అమర్‌నాథ్ యాత్ర రూట్ (Amarnath Yatra route) మొత్తంలో ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్‌ను పెంచారు. హైవేస్ నుంచి పహల్గాం, బాల్టల్‌లోని బేస్ క్యాంప్ వరకు సీసీటీవీలను ఏర్పాటు చేశారు.
  • ఏరియల్ సర్వీలెన్స్‌తో పాటు అనుమానాస్పద వ్యక్తులను, కదలికలను పసిగట్టేందుకు స్పాటర్స్‌ను ఏర్పాటు చేశారు.
  • దీంతో పాటు బైసరాన్ లోయ వంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఆర్మీ, ప్యారమిలిటరీ దళాలలను శాశ్వతంగా నియమించే అవకాశం ఉంది.

పహల్గాం దాడుల ప్రభావం | Pahalgam Terror Attack Effect

Pahalgam terror attack
ఉగ్రవాదులు టార్టెట్ చేసిన ప్రాంతం

ఉగ్రదాడి తరువాత ఎక్కువ మంది పర్యాటకులు తమ ట్రిప్‌ను అర్థాంతరంగా ముగించి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. అలాగే ముందుస్తు బుకింగ్ చేసుకున్న వాళ్లు కేన్సిల్ చేసుకుంటున్నారు.

అమర్‌నాథ్ యాత్రతో పాటు శ్రీనగర్ (Srinagar) చూసేందుకు చాలా మంది కాంబినేషన్ ప్యాకేజీలు బుక్ చేసుకున్నారని అయితే ఉగ్రదాడి తరువాత చాలా మంది తమ బుకింగ్స్ కేన్సిల్ చేసుకున్నారని ట్రావెల్ ఏజెంట్స్ తెలిపారు.

ఉగ్రదాడి వల్ల ఈ సీజన్‌లో ఇక పర్యాటకులు వచ్చే అవకాశం దాదాపు లేనట్టే అని హోటల్ నిర్వాహకులు కూడా తెలిపారు. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వం ( J & K Govt ) మాత్రం అమర్‌నాథ్ యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది. 

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంత మంది ఈ పవిత్రమైన తీర్థయాత్రకు వెళ్లనున్నారో అనేది చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన పహల్గాం మార్గంలో వెళ్లేందుకు భక్తులు సుముఖత చూపిస్తారా అనేది కొంత కాలం ఆగితేనే తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!