పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న.
ఎందుకంటే అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra 2025) పహల్గాం నుంచే కొనసాగుతుంది. ఇది తెలిసిన తరువాత కూడా తీర్థయాత్రకు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధం అవుతారు? వారికి ధైర్యం కలిగేలా ప్రభుత్వం ఏం చేయనుంది ? ఇలాంటి ఎన్నో విషయాలు, అనేక ప్రశ్నలు పర్యాటకులను, పర్యాటక రంగాన్ని (Kashmir Tourism) తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ముఖ్యాంశాలు
సెక్యూరిటీ పెంపు | Heightened Security Measure
అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు సురక్షితంగా ఉంచేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ (CRPF), ఐటీబీపి (ITBP), ఇతర పారా మిలిటరీ ఫోర్సులు, పోలీసులు ఇలా వేలాది సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.
- అమర్నాథ్ యాత్ర రూట్ (Amarnath Yatra route) మొత్తంలో ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ను పెంచారు. హైవేస్ నుంచి పహల్గాం, బాల్టల్లోని బేస్ క్యాంప్ వరకు సీసీటీవీలను ఏర్పాటు చేశారు.
- ఏరియల్ సర్వీలెన్స్తో పాటు అనుమానాస్పద వ్యక్తులను, కదలికలను పసిగట్టేందుకు స్పాటర్స్ను ఏర్పాటు చేశారు.
- దీంతో పాటు బైసరాన్ లోయ వంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఆర్మీ, ప్యారమిలిటరీ దళాలలను శాశ్వతంగా నియమించే అవకాశం ఉంది.
పహల్గాం దాడుల ప్రభావం | Pahalgam Terror Attack Effect

ఉగ్రదాడి తరువాత ఎక్కువ మంది పర్యాటకులు తమ ట్రిప్ను అర్థాంతరంగా ముగించి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. అలాగే ముందుస్తు బుకింగ్ చేసుకున్న వాళ్లు కేన్సిల్ చేసుకుంటున్నారు.
అమర్నాథ్ యాత్రతో పాటు శ్రీనగర్ (Srinagar) చూసేందుకు చాలా మంది కాంబినేషన్ ప్యాకేజీలు బుక్ చేసుకున్నారని అయితే ఉగ్రదాడి తరువాత చాలా మంది తమ బుకింగ్స్ కేన్సిల్ చేసుకున్నారని ట్రావెల్ ఏజెంట్స్ తెలిపారు.
ఉగ్రదాడి వల్ల ఈ సీజన్లో ఇక పర్యాటకులు వచ్చే అవకాశం దాదాపు లేనట్టే అని హోటల్ నిర్వాహకులు కూడా తెలిపారు. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వం ( J & K Govt ) మాత్రం అమర్నాథ్ యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంత మంది ఈ పవిత్రమైన తీర్థయాత్రకు వెళ్లనున్నారో అనేది చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన పహల్గాం మార్గంలో వెళ్లేందుకు భక్తులు సుముఖత చూపిస్తారా అనేది కొంత కాలం ఆగితేనే తెలుస్తుంది.
సంబంధిత కథనాలు
- Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…మీ అధ్యాత్మిక యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి !
- Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ
- Kedarnath Yatra 2025 : కేథార్నాథ్కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC
- Char Dham Yatra 2025 : ఛార్ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్
- చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
- యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates
- కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.