5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది.
ముఖ్యాంశాలు
2020 లో కోవిడ్ -19 సమయంలో ఈ యాత్రను నిలిపివేశారు. దాని తరువాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తత తరువాత ఈ యాత్ర మళ్లీ మొదలు కాలేదు. అయితే ఇటీవలే ఇరు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పలు అంశాలపై చర్చించుకుని కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ఈ యాత్రకు మార్గం సుగమం అయింది అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…మీ అధ్యాత్మిక యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి !
కైలాష్ మానసరోవర యాత్ర అంటే ఏంటి ? | What Is the Kailash Mansarovar Yatra?
కైలాష్ మానసరోవర యాత్ర (Kailash Mansarovar Yatra ) అనేది టిబెటన్ పీఠభూమిపై ఉన్న కైలాస పర్వతం, మానసరోవర్ సరస్సునకు (Lake Mansarovar) భక్తులు చేసే పవిత్రమైన తీర్థయాత్ర.
ఒక పర్ఫెక్ట్ పిరిమిడ్ ఆకారంలో ఉండే కైలాస పర్వతాన్ని (mount kailash) మహాశివుడు కొలువై ఉండే ప్రాంతంగా కొలుస్తారు.ఈ పర్వతానికి హిందూ మతంతో పాటు బుద్దిజం, జైన, బోన్ మతంలో (Bon religion) కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఈ తీర్థయాత్రలో భాగంగా భక్తులు కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేపడతారు. అనంతరం 4,600 మీటర్ల ఎత్తులో ఉన్నమానసరోవర్ సరస్సును దర్శించుకుంటారు. ఈ ట్రెక్ ఎంత కష్టమో కైలాస (mount kailash trek) దర్శనం చేసుకున్నాక అంతే ఇష్టంగా మారుతుంది.
ఎలా వెళ్లాలి ? | Official Routes and Travel Details

ఈ యాత్రను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహిస్తుంది. కేవలం రెండు మార్గాల్లోనే కైలస పర్వతానికి వెళ్లే అవకాశం ఉంది.
- లిపులేఖ్ పాస్, ఉత్తరాఖండ్ (Lipulekh Pass) : కైలాస పర్వతానికి చేరుకునేందుకు అనాదిగా ఉపయోగించే కఠినమైన మార్గం ఇది. ఈ మార్గంలో 5,060 మీటర్ల ఎత్తులో (17,000 అడుగులు) ఉండే డోల్మా లా ( Dolma La) వంటి పాసెస్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారిలో వెళ్తే 23 నుంచి 25 రోజుల సమయం పడుతుంది.
- నాథు లా పాస్, సిక్కిం (Nathu La Pass) : 2015 లో అందుబాటులోకి వచ్చిన ఈ మార్గం వల్ల టిబెటెన్ పీఠభూమి(Tibetan plateau) వరకు కూడా వాహనాల్లో వెళ్లే సదుపాయం కలిగింది. అయితే ఈ దారిలో వెళ్తే ఖర్చు కూడా పెరుగుతుంది.
- ఇక మూడో మార్గం గురించి కూడా తెలుసుకుందాం. నేపాల్ ( Nepal) నుంచి కూడా మౌంట్ కైలాష్ కనిపిస్తుంది. దీని కోసం ప్రైవేట్ ఆపరేటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. మీరు రోెడ్డు మార్గాన వెళ్లవచ్చు, లేదంటే విమానంలో దూరం నుంచి మీకు కైలాస పర్వతం దర్శం చేయిస్తారు. కాకపోతే ప్యాకేజీ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. సుమారు రూ.2 లక్షల 75 వేల వరకు చార్జీ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : Kedarnath Yatra 2025 : కేథార్నాథ్కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC
ఎవరు వెళ్లగలరు ? | Eligibility and Registration
18 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న భారతీయులు ఈ యాత్ర చేపట్టేందుకు అనుమతి ఉంది.
- అయితే యాత్రికులు ఆరోగ్యం, వారి ఫిట్నెస్ను బట్టి అనుమతి లభిస్తుంది.
- ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఇది ఏప్రిల్, మే నెలలో ప్రారంభం అవుతుంది.
- దీని కోసం విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ (MEA) పోర్టల్ను విజిట్ చేయాల్సి ఉంటుంది.
- తీర్థయాత్రికులు తాము ఏ మార్గంలో కైలాస పర్వత సందర్శనానికి వెళ్తున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి ఏ దారిలో వెళ్లేందుకు అనుమతి ఇస్తారు అనేది కంప్యూటర్ నిర్వహించే ఒక డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
- ఒక్కసారి ఒక రూట్ ఎంచుకున్నాక ఇక తరువాత దాన్ని మార్చుకునే అవకాశం లభించదు.
- ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
ఎంత ఖర్చు అవుతుంది ? | Cost and Logistics
కైలాస పర్వతానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వం సూచించిన రెండు మార్గాలు, వాటి చార్జీలు
- లిపులేఖ పాస్ రూట్ : రూ. 1 లక్షా 8 వే నుంచి రూ.2 లక్ష ల వరకు
- నాథు లా పాస్ రూట్ : రూ.2 లక్షల 20 వేల నుంచి రూ.2 లక్షల 40 వేల వరకు
- పైన వివరించిన చార్జీలు ఒక ప్రయాణికుడికి మాత్రమే వర్తిస్తాయి.
ఈ ప్యాకేజీలో రవాణా, వసతి, భోజనం ఇతన ప్రయాణ సదుపాయాలను టిబెటన్ అధికారులు, రాష్ట్ర టూరిజం సహకారంతో విదేశి వ్యవహారాల శాఖ కల్పిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Tips For Kailash Mansarovar Yatra 2025
కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సాగుతుంది. 17,000 అడుగులు ఎత్తులో ఈ యాత్ర సాగుతుంది కాబట్టి దీని కోసం శారీరకంగా కూడా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.యాత్రకు ముందు ప్రయాణికులు (Travelers) వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో పాటు స్థానిక అధికారులు కూడా ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటారు.
ముఖ్యమైన విషయాలు | Kailash Mansarovar Yatra 2025 Quick Facts

5 సంవత్సరాల తరువాత కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది 2025 జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం అవ్వనుంది. ఈ యాత్రలో కీలక అంశాలు…
- ఢిల్లీ నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర 5 గ్రూపులు ఉంటాయి. ప్రతీ గ్రూపులో 50 మంది వరకు ఉంటారు. మొత్తం 250 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది అని తెలుస్తోంది.
- యాత్రికుల సదుపాయం కోసం ఇరు దేశాల మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ కూడా (Indo-china Direct Flights ) నడిపేందుకు భారత్ – చైనా అంగీకరించాయి.
- తీర్థయాత్రకు వెళ్లాలి అనుకునే భక్తుల వద్ద వాలిడ్ పాస్పోర్ట్ తప్పనిసరిగ్గా ఉండాలి.
- టిబెట్లోకి (Tibet) ప్రవేశించేందుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
- విదేశీయులు, ఎన్నారైలు, ఓసీఐలు డిపార్చర్కు మూడు రోజుల ముందే వీసా ప్రాసెసింగ్, క్లియరెన్స్ కోసం ఖాట్మాండు (Khatmandu) చేరుకోవాల్సి ఉంటుంది.
- హెలికాప్టర్ దర్శన్ (Helicopter Darshan) : వివిధ కారణాల వల్ల ట్రెక్కింగ్ చేయలేని వారి కోసం హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది.
- పితోర్ఘర్ (Pithoragarh) నుంచి గుంజీ (Gunji) వరకు ఉండే ఈ ప్రయాణంలో భారత భూభాగం నుంచి మౌంట్ కైలాష్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates
ముఖ్యమైన తేదీలు | Key Dates, Checklist
- యాత్ర ప్రారంభం అయ్యే తేది : 2025 జూన్ 30
- బ్యాచ్ : మొత్తం 5 గ్రూపులు. ప్రతీ గ్రూప్లో 50 మంది ఉంటారు.
- యాత్రా సమయం : బట్టి, రూటును బట్టి 12 రోజుల నుంచి 25 రోజుల వరకు సమయం పడుతుంది.
- రూటు : ఢిల్లీ → ఉత్తరాఖండ్ → లిపులేఖ్ పాస్ → టిబెట్
- ఎత్తు : 5,660 మీటర్లు (18,500 అడుగులు)
- అర్హత : వ్యాలిడ్ పాస్పోర్టు ఉన్న భారతీయులు
- ప్రత్యేక సదుపాయలు : భారత్ చైనాకు డైరక్ట్ విమానం, హెలికాప్టర్ రూట్ ( అవసరాన్ని బట్టి)
గమనిక : అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి మీకు వివరాలు (Kailash Mansarovar Yatra 2025) అందించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం, రిజిస్ట్రేషన్ కోసం లేదా మరిన్ని వివరాల కోసం విదేశీ వ్యవహరాల శాఖ అధికారిక పోర్టల్ను విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. | YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. | WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి. | ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.