గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది.
ముఖ్యాంశాలు
ఆ తేదీలివే | Char Dham Yatra 2025 Dates
- యమునోత్రి, గంగోత్రి (Gangotri) ఆలయాల ద్వారాలు 2025 ఏప్రిల్ 30వ తేదీన తెరుచుకుంటాయి.
- కేదార్నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలు 2025 మే 2వ తేదీన తెరుచుకుంటాయి.
- బద్రినాథ్ ఆలయ ద్వారాలు 2025 మే 4వ తేదీన తెరుచుకోనున్నాయి.
- ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
సిద్దం అవుతున్న పవిత్ర క్షేత్రాలు | Arrangements
దాదాపు 6 నెలల పాటు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఈ పవిత్ర క్రేత్రాల ద్వారాలు తెరుచుకున్నాక భారీ సంఖ్యలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటా అనేది చాలా కీలకం అని ఆ రాష్ట్ర పుష్కర్ సింగ్ ధామ్ తెలిపారు.
అందుకే యాత్రికులకు (Tourists) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు సూచించారు.
- ఇది కూడా చదవండి : Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…మీ అధ్యాత్మిక యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి !
చార్ ధామ్ యాత్ర విశేషాలు | About the Char Dham Yatra
చార్ ధామ్ యాత్ర అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన యాత్రలో ఒకటి. జీవితంలో ఒక్కసారైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ (Badrinath) ఆలయాల దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీని కోసం కొన్ని నెలల ముందు నుంచే మానసకింగా, శారీరకంగా యాత్రికులు సిద్ధం అవుతారు.
యమునోత్రి (Yamunotri) నుంచి ప్రారంభం అయ్యే చార్ ధామ్ యాత్ర బద్రినాథ్ ఆలయంలో బద్రి విశాలుడిని (Badri Vishal) దర్శించుకోవడంతో ముగుస్తుంది.
Char Dham Yatra 2025 Dates : ప్రస్తుతం ఈ ఆలయ పరిసరాల్లో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇక మీరు కూడా చార్ధామ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటే గతంలో తెలుగులో నెం.1 ట్రావెల్ వెస్సైట్ అయిన Prayanikudu.com లో గతంలో కొన్ని పోస్టులు పబ్లిష్ చేశాము. వాటిని రిఫర్ చేయగలరు.
- ఇది కూడా చదవండి : Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ
- ఇది కూడా చదవండి : Char Dham Yatra 2025 : ఛార్ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్
- ఇది కూడా చదవండి : Kedarnath Yatra 2025 : కేథార్నాథ్కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. | YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. | WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి. | ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.