Rail Coach Restaurant : ఫుడ్ లవర్స్కు బెస్ట్ ఆప్షన్..రైలు బోగీ రెస్టారెంట్..అదుర్స్ అనిపించే యాంబియెన్స్
Rail Coach Restaurant : భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులను, పర్యాటకులను ఆకర్షించేందుకు వినూత్నంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాత రైలు బోగీలను విలాసవంతమైన రెస్టారెంట్లుగా మార్చి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ప్రారంభించడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య రైల్వే జంక్షన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ తరహా రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ప్రారంభించింది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, 24 గంటల సేవలతో, ప్రయాణికులతో పాటు విజయవాడ ప్రజలకు కూడా సరికొత్త రుచులను అందించేందుకు ఈ హల్దీరామ్స్ ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది. ఈ కొత్త రెస్టారెంట్ విశేషాలు ఈ వార్తలో చూద్దాం.
విజయవాడలో ప్రారంభమైన రైల్ కోచ్ రెస్టారెంట్
భారతీయ రైల్వే పాత రైలు బోగీలను ఉపయోగించి, వాటిని అత్యాధునిక సౌకర్యాలతో రెస్టారెంట్లుగా మారుస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో తాజాగా ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్లో ప్రారంభమైన రెండో రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది. దీనిని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్, హల్దీరామ్స్ ఛైర్మన్ శివ్ కిషన్ జీ అగర్వాల్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ను ప్రముఖ స్నాక్స్, స్వీట్స్ తయారీ సంస్థ అయిన హల్దీరామ్స్ (Haldiram’s) నిర్వహిస్తోంది. అందుకే దీనికి హల్దీరామ్స్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. గతంలో నాగ్పూర్లో కూడా హల్దీరామ్స్ సంస్థ ఇలాంటి రెస్టారెంట్ను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
స్పెషల్ డిజైన్, ఆకర్షణలు
ఈ రెస్టారెంట్ను పాత స్లీపర్ కోచ్ను పూర్తిగా మార్పులు చేసి ఏర్పాటు చేశారు. దీని డిజైన్, సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోచ్ లోపలి భాగం అద్భుతంగా, కొత్తగా డిజైన్ చేశారు. ఇది పూర్తిగా ఏసీ (Air Conditioned) రెస్టారెంట్. ఈ థీమ్ రెస్టారెంట్, కొత్త ప్రదేశాల్లో ఫుడ్ రుచి చూడాలనుకునే వారికి, థీమ్ రెస్టారెంట్లు ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్గా నిలవనుంది. ఈ రెస్టారెంట్లో మొత్తం 110 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇందులో కోచ్ లోపల 46 మంది కూర్చోగా, కోచ్ బయట ప్రత్యేకంగా 64 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
లభ్యత, భవిష్యత్తు ప్రణాళికలు
ఈ రెస్టారెంట్ ద్వారా రైల్వే ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. హల్దీరామ్స్ ఎక్స్ప్రెస్ 24 గంటలూ తెరిచే ఉంటుంది. దీంతో రైలు ప్రయాణికులు, పర్యాటకులు, విజయవాడ ప్రజలు ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. ఈ రెస్టారెంట్లో మొత్తం 126 రకాల ఫుడ్ ఐటెమ్స్ను ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా, స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), ఐఆర్సీటీసీ (IRCTC) కేటరింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. విజయవాడ డివిజన్లో భవిష్యత్తులో మరో మూడు రైల్ కోచ్ రెస్టారెంట్లు అందుబాటులోకి రాబోతున్నాయని రైల్వే ప్రకటించింది.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
