తంజన్ అనే రాక్షసుడి పేరుపై ఏర్పడిన నగరం తంజావూరు
ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ( Brihadeeswara Temple ) ఆలయాన్ని పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు. భారతీయ నిర్మాణ కళకు, శిల్పకళా వైభవానికి చోళులు అందించిన అద్భుతమైన నీరాజనం ఈ ఆలయం. ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందిన బృహదీశ్వరాలయ ఆలయం 2010 లో వెయ్యేళ్లు పూర్తి చేసుకుంది.

తాజ్మహల్, ఎర్రకోట లాంటి కట్టడాలను నిర్మించేందుకు యుద్ధఖైదీలతో రాళ్లు ఎత్తించారు. కానీ దానికి భిన్నంగా బృహదీశ్వరాలయ ఆలయ నిర్మాణంలో భక్తులే స్వచ్ఛంగా పాల్గొన్నారు. వారి భక్తికి మెచ్చిన రాజరాజచోళుడు తన పేరుతో పాటు ఆలయ నిర్మాణంలో పాల్గొన్న వారి పేర్లు కూడా చేర్చాలని ఆదేశించాడట.
తంజావూరులో మొత్తం 74 దేవాలయాలు ఉండగా బృహదీశ్వర ఆలయం ( Brihadeeswarar Temple _ అందులో అద్భుతం అని చెప్పవచ్చు. చోళుల నిర్మాణ శైలికి, సాంకేతికతకు, శక్తికి ఈ ఆలయం నిదర్శనం. 29 ఎకరాల్లో లక్షా 30 వేల టన్నుల గ్రానైట్తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురం దీనిని మనం విమానం అని కూడా పిలుస్తాం దీని ఎత్తే 66 మీటర్లు ఉంటుంది. 80 టన్నుల శిఖరాన్ని ఆలయ పైభాగంలో ఏర్పాటు చేయడం అనేది నాటి ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం.
ఇది చదివారా ? : కామాఖ్య దేవీ కథ
రాక్షసుడి పేరుతో ఏర్పడిన నగరం
How Thanjavur Got Its Name : తంజావూరు పేరు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు ఇక్కడ తంజన్ అన్ అనే రాక్షసుడు ఉండేవాడట.విష్ణుమూర్తి అవతారంలో వచ్చిన నీలమేఘ పెరుమాళ్, శ్రీ అనంతవల్లి అమ్మ ఈ అసురుడిని అంతం చేశారట.
అయితే అతని చివరి కోరికగా తను ఓడిపోయిన చోట ఒక అందమైన నగరాన్ని నిర్మించాలని, దానికి తన పేరు పెట్టాలని అతను కోరుకున్నాడట.తరువాత ఈ నగరం వెలిసింది.
నేచురల్ రంగులను మాత్రమే వాడారు

Colors Used In Brihadeeswarar Temple : బృహదీశ్వరాలయ ఆలయం అందంగా కనిపించేందుకు కారణం కేవలం నేచురల్ రంగులను వాడటమే. పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాలు ఆకులను రంగుల కోసం వినియోగించడ వల్లేనేమో ఆలయం ఇంత అందంగా పవిత్రంగా ఆధ్మాత్మిక శోభను కలిగి ఉంటుంది.
బ్రిటిషర్లు…

ఆలయం చుట్టూ ఉన్న ఫ్లోరింగ్లో నల్లగా కనిపిస్తున్న రాళ్లను బ్రిటిషర్లు వేయించారు. ఈ పెద్ద బండరాళ్లను మాత్రం చోళులు వేయించారు.
ఇది మిస్ అయ్యారేమో : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
ద్రవిడ ఆర్కిటెక్చర్
Chola Architecture In Brihadeeswarar Temple : తమిళనాడులోని ఆలయాలను ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించడం గురించి మనకు తెలుసు. అయితే బృహదీశ్వరాలయ ఆలయాన్ని మాత్రం చోళ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించారు.
మిగితా ఆలయాల్లో ప్రవేశ ద్వారం పెద్దగా ఉంటుంది ఆలయ శిఖరం చిన్నగా ఉంటుంది. అయితే చోళ ఆర్కిటెక్చర్లో ప్రవేశ శిఖరం చిన్నగా …గర్భగుడి ఉన్న ప్రధాన శిఖరం లేదా విమానం పెద్దగా ఉంటుంది.
మహాద్భుతమైన నిర్మాణం
How Much Time Take To Build Brihadeeswarar Temple : ఈ ఆలయాన్ని కట్టడానికి ఎన్నేళ్లు పట్టుంటుంది ? ఎనీ గెస్ ? 30 ఏళ్లు లేదా 40 ఏళ్లు అంటారా ? సరే ఆన్సర్ చెబుతాను జస్ట్ 6 ఏళ్లలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు.
పైగా ఈ ఆలయ నిర్మాణానికి కావాల్సిన గ్రానైట్ను 70 కిమీ దూరంలో ఉన్న పుదుకోవైటై అనే ప్రాంతంలో ఉన్ననార్తామలై అనే ప్రాంతం నుంచి రెండు కొండలను పూర్తిగా తొలచి గ్రానైట్ను ఇక్కడికి తీసుకొచ్చారు. దీని కోసం 12000 ఏనుగులను,5 వేల గుర్రాలను వినియోగించారు. మొత్తం 50 వేల మంది ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
గోపురం నీడ కింద పడదు

ఆలయ నందికీ ఓ చరిత్ర ఉంది

Brihadeeswarar Temple Nandi Facts : ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నంది చోళులు నిర్మించిన నంది. కాదు దీనిని 16 శతాబ్దంలో తంజాపూరు రాజు అయిన రాజా నాయక్ నిర్మించాడు. శివుడి ఆలయ అంత పెద్దగా ఉంది. నంది విగ్రహం చిన్నగా ఉంది అని భావించి చిన్న నందిని తొలగించి వేరే నందిని ప్రతిష్టించారు.
పన్నెండు అడుగుల ఎత్తు, 19 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 25 వేల కిలోల బరువు ఉన్న నందిని ఏక శిల నుంచి మలిచారు.లేపాక్షిలో ఉన్న నంది విగ్రహం తరువాత ఏకశిలతో మలిచిన రెండవ అతిపెద్ద నంది విగ్రహం ఇదే.
ఈ స్టోరిని ప్రయాణికుడు యూట్యూబ్లో చూడండి
ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నన్ను ప్రోత్సాహించడం అస్సలు మర్చిపోకండి