Saudi Arabia Visa : భారత్‌ సహా 14 దేశాల వీసా బ్యాన్ చేసిన సౌది అరేబియా

షేర్ చేయండి

ఇస్లాం మతస్థులకు సౌది అరేబియా (Saudi Arabia Visa) అత్యంత ప్రధానమైన దేశం. చాలా మంది ముస్లిమ్స్ తమ జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలి అని కోరుకుంటారు. అయితే 2025 లో హజ్‌కు వెళ్లాలి అని భావిస్తోన్న అలాంటి వారికి షాక్ ఇచ్చింది సౌది అరేబియా. 

భారత దేశంతో సహా 14 దేశాల వీసాలను తాత్కాలికంగా బ్యాన్ చేసింది (Saudi Bans Indian Visa). అయితే ఈ వీసా బ్యాన్ వెనక ఉన్న కారణం తెలుసుకుంటే సౌదీ చేసిన పని సరైనదే అనిపిస్తుంది. 

వీసా బ్యాన్ ఎందుకు ? Why Saudi Arabia Visa Is Banned For Indians

ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలి విజిట్ వీసాలను జారీ చేయకుండా బ్యాన్ చేస్తూ సౌది ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భారత్‌తో పాటు, అల్గేరియా, బంగ్లాదేశ్ , ఈజిప్టు (Egypt), ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, పాకిస్తాన్ సుడాన్, టూనిషియా, యెమెన్ దేశాలు ఉన్నాయి.

  • ఈ బ్యాన్ అనేది 2025 ఏప్రిల్ 13 న అమలవుతుంది. ఈ ఏడాది జూన్ వరకు అమలులో ఉంటుంది. 
  • అందుకే ఎవరైనా ఉమ్రాకు (Umrah) అప్లై చేయాలి అనుకుంటే వారు ఏప్రిల్ 13వ తేదీకి ముందే అప్లై చేయాల్సి ఉంటుంది. 
  • ఏప్రిల్ 13వ తరువాత నుంచి ఉమ్రా యాత్ర ముగిసేంత వరకు ఈ దేశాల ప్రజలకు కొత్త వీసా జారీ చేయడం జరగదు.

బ్యాన్ చేయడానికి కారణాలు | Hajj Disaster 2024

హజ్‌కు (Hajj Pilgrimage) అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చే వారి సంఖ్యను తగ్గించడానికి సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంతో మంది తీర్థయాత్రికులు సౌదీ రాజ్యంలోకి వివిధ వీసాల ద్వారా చేరుకుని హజ్‌‌లో పాల్గొనేవారు. అందులో చాలా మంది కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదట.

ఇలా చేసే వారి సంఖ్యా భారీగా పెరిగింది. కోటా కన్నా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ లేకుండా హజ్‌కు వచ్చేవారు. అధికారులు ఊహించినదాని కన్నా ఎక్కువ మంది రావడంతో 2024 జూన్ 14 నుంచి 19వ తేదీ మధ్యలో సుమారు 1301 మంది హజ్ యాత్రికులు మరణించారు.

countries without rivers
సౌది అరేబియా

సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చాలా మంది వడదెబ్బ, డీహైడ్రేషన్ వల్ల మరణించారు ( 2024 Hajj Extreme Heat Disaster) . ఇందులో 672 మంది ఈజిప్టు వాసులు ఉండగా, 98 మంది భారతీయులు కూడా ఉన్నారు

హజ్ కోటా | Hajj Quota For Countries

హజ్ యాత్ర కోటా వచ్చేసి సంవత్సరానికి 2 నుంచి 3 మిలియన్ల మందికి మాత్రమే ఉంటుంది. కాగా 2024లో జూన్ 14 నుంచి 19వ తేదీ మధ్యలో అంటే ఆరు రోజుల్లోనే 18 లక్షల మంది మంది హజ్‌కు చేరుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనివారే అధికంగా ఉన్నారు. 

ఉల్లంఘిస్తే 5 సంవత్సరాలు బ్యాన్

సౌది తీసుకున్న నిర్ణయాన్ని అతిక్రమిస్తూ అనధికారంగా హజ్‌ జరిగే సమయం వరకు ఉండే ప్రయాణికుల వీసాను 5 సంవత్సరాల వరకు బ్యాన్ చేయనున్నారు.

  • దీంతో పాటు గతంలో జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు 16 భాషల్లో సులభంగా అర్థం అయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు.
  • సక్రమమైన మార్గంలోనే హజ్‌కు చేరుకోవాలి సూచిస్తున్నారు సౌది అధికారులు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!