Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు
Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.