Air India Crash : అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్, ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడో వెల్లడించారు.
రమేష్ మాట్లాడుతూ.. “నేను విమానం నుంచి బయటికి దూకలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో నేను కూర్చున్న సీటు విరిగిపోయి, నన్ను దూరంగా విసిరేసింది. అందుకే విమానంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు, నేను ప్రాణాలతో బయటపడగలిగాను” అని విశ్వాస్ కుమార్ చికిత్స పొందుతూ వైద్యులకు, మీడియాకు తెలిపారు. ప్రమాదంలో ఆయన శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ప్రమాదం నుండి బయటపడ్డారని వైద్యులు ధృవీకరించారు.

విశ్వాస్ తన అనుభవాన్ని వివరిస్తూ, “అంతా నా కళ్ల ముందే జరిగిపోయింది. నేను అసలు ఎలా బతికాడో నాకే అర్థం కావడం లేదు. విమానం కూలిన వెంటనే నేను చనిపోయానేమో అనుకున్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి, చుట్టూ శిథిలాలు, మంటలు, చనిపోయిన వారి శరీరాలు కనిపించాయి. నేను వెంటనే నా సీటు బెల్ట్ తీసి, విరిగిన తలుపు ద్వారా బయటికి వచ్చేశాను” అని తెలిపారు. “నా ఎడమ చేతికి మంటల కారణంగా గాయమైంది. ఆ భయంకరమైన వాతావరణం నుండి నెమ్మదిగా నడుచుకుంటూ దూరంగా వెళ్ళాను. అక్కడి ప్రజలు సహాయం చేసి నన్ను అంబులెన్స్లోకి ఎక్కించారు” అని విశ్వాస్ వివరించారు.
ఈ విమాన ప్రమాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు వెళ్లి విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ఆయన బయటపడిన విధానం గురించి విశ్వాస్ స్వయంగా ప్రధానికి వివరించారు.
ఇది కూడా చదవండి : Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు
బ్రిటన్లో నివాసం ఉంటున్న 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్, గుజరాత్లోని తన కుటుంబాన్ని కలవడానికి భారతదేశానికి వచ్చారు. తిరిగి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం (ఫ్లైట్ నంబర్ AI 171) లోని 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ఆయన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ కూడా ఈ విమానంలోనే (సీటు 11J) ప్రయాణిస్తున్నారని, దురదృష్టవశాత్తు ఆయన మరణించారని వార్తలు వచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత రక్తపు మరకలతో, గాయాలతో విశ్వాస్ నడుచుకుంటూ అంబులెన్స్లోకి ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ప్రజలను షాక్కు గురిచేసింది.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది (మొత్తం 241 మంది) మృతి చెందారు. హాస్టల్ భవనం కూలిపోవడం వల్ల అక్కడ కూడా 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించారు. దశాబ్ద కాలంలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాలలో ఇది ఒకటి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.