Ram Yatra Ram Katha : ట్రైన్ కాదు, టెంపుల్.. రామ కథ వింటూ 8,000 కి.మీ. యాత్ర!
Ram Yatra Ram Katha : భారతదేశంలో ఆధ్యాత్మికత, భక్తికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడి భక్తులు ఆయన వనవాస మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణించడానికి భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా రామ యాత్ర రామ కథ’ (Ram Yatra Ram Katha) అనే ప్రత్యేక రైలు ప్రయాణం మొదలైంది. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. 8,000 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో చిత్రకూట్ ధామ్ (Chitrakutdham) నుంచి అయోధ్య వరకు, శ్రీలంకతో సహా రామాయణంలో ప్రస్తావించిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ రైలు చక్రాలపై ఫైఫ్ స్టార్ హోటల్ (Five-Star Hotel on Wheels) అనుభూతిని అందిస్తోంది.
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే లక్ష్యంతో ప్రారంభమైన రామ యాత్ర రామ కథ రైలు దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ యాత్ర 2025 అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ (Safdarjung Railway Station) నుంచి ప్రారంభమై, నవంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో ముగుస్తుంది.

ఇది మొత్తం 8,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసం సమయంలో ప్రయాణించిన మార్గాన్ని (Ram Van Gaman Path) అనుసరిస్తుంది. ఈ యాత్రలో పూజ్య మురారి బాబు (Pujya Murari Bapu) పాల్గొని, ప్రతి పుణ్యక్షేత్రంలో రామ కథను భక్తులకు ప్రవచిస్తారు. ఈ ప్రత్యేక రైలు రామాయణంలో ప్రస్తావించిన అనేక పుణ్యక్షేత్రాలను కలుపుతూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తుంది. ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ (Ayodhya, Chitrakootdham), మధ్యప్రదేశ్, తమిళనాడు (Rameshwaram) వంటి రాష్ట్రాల్లోని పవిత్ర స్థలాలను సందర్శిస్తుంది.
ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఈ రైలు రామేశ్వరం (Rameshwaram) వరకు ప్రయాణించిన తరువాత, అక్కడి నుంచి భక్తులు విమానంలో శ్రీలంక రాజధాని కొలంబోకు (Colombo) వెళ్లి, అక్కడి రామాయణ సంబంధిత ప్రదేశాలను దర్శించుకుని, తిరిగి అయోధ్య మీదుగా ఢిల్లీకి చేరుకుంటారు. ఈ రైలులో భక్తులకు అత్యున్నత స్థాయి సేవలు మరియు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు సంప్రదాయ స్వాగతం, రుచికరమైన శాకాహార భోజనాలు (Vegetarian Meals), పరిశుభ్రమైన కోచ్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ప్రతి కోచ్లో భద్రతా సిబ్బంది, కామన్ ఏరియాలలో సీసీటీవీ నిఘా, రోజువారీ శానిటైజ్ చేసిన పరుపులు (Bed Sheets), సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికులు ఈ యాత్రను కేవలం రైలు ప్రయాణంగా కాకుండా, భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర అవకాశంగా భావిస్తున్నారు.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
