Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం రెండో దశ గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బార్లో శ్రీరాముడిని సీతాదేవితో పాటు రాజుగా ప్రతిష్ఠించారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక విషయాలను వెల్లడించారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో మొత్తం ఎంత బంగారం వాడారు, దాని విలువ ఎంత, ఇతర నిర్మాణ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
45 కేజీల బంగారం
ఆయోధ్యలో కొలువై ఉన్న శ్రీరాముడి ఆలయ నిర్మాణంపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో మొత్తం 45 కిలోల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఈ బంగారం విలువ దాదాపు రూ.50 కోట్లు (పన్నులు మినహా) అని ఆయన తెలిపారు. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని తలుపులకు, రాముడి సింహాసనానికి బంగారం విస్తృతంగా ఉపయోగించబడిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా, శేషావతార ఆలయంలో బంగారు పనులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి
రామమందిరం ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే పూర్తైనప్పటికీ ఆలయ సముదాయంలోని మ్యూజియం (Museum), ఆడిటోరియం (Auditorium), గెస్ట్ హౌస్ (Guest House) నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయని నృపేంద్ర మిశ్రా వివరించారు. ఈ పనులన్నీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

40 మెట్లు ఎక్కాల్సిందే
రామ దర్బార్ను సందర్శించడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తారని మిశ్రా తెలిపారు. ఉచిత పాస్లను జారీ చేయడం ద్వారా పరిమిత సంఖ్యలో దర్శనాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai) మాట్లాడుతూ..ఆలయంలో ఏడు విగ్రహాల ప్రతిష్ఠాపన గురువారం పూర్తయిందని తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ప్రతిష్ఠించిన రామ దర్బార్లో శివలింగం, గణపతి విగ్రహం, హనుమాన్ విగ్రహం, సూర్య, భగవతి, అన్నపూర్ణ మాత విగ్రహాలు వివిధ ప్రదేశాలలో ఉన్నాయని ఆయన వివరించారు. దర్బార్ను సందర్శించడానికి వచ్చే భక్తులు ఓపికగా ఉండాలని ఆయన సూచించారు. రామ దర్బార్ 20 అడుగుల ఎత్తులో ఉన్నందున, భక్తులు సుమారు 40 మెట్లు ఎక్కవలసి ఉంటుందని, అందువల్ల పైకి వెళ్ళడానికి పరిమిత ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వృద్ధుల కోసం లిఫ్ట్ నిర్మిస్తున్నప్పటికీ అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు.

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.