తంత్ర సాధన చేసే భక్తులకు ఇది ముఖ్యమైన యాత్రా స్థలం
అస్సాంలోని గౌహతిలో ( ఉన్న కామాఖ్య దేవాలయం (Kamakhya Temple ) భారతదేశంలోని పురాతన శక్తి పీఠంగా పరిగణించబడుతుంది.
సతీదేవికి సంబంధించిన 51 పవిత్ర స్థలాలలో ఇది ఒకటిగా నమ్ముతారు.
కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.
సతీదేవీ కథ
మహాశివుని ( Lord Shiva) భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది.
అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం, కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంటుంది.
ALSO READ : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేదో తెలుసా ?
దశ మహా విద్యలు | Dasha Maha Vidya Of Kamakhya
కామాఖ్య దేవాలయంలో పది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. అ దేవాలయాలు వరుసగా : కాళీ, తార, సోదశీ, భువనేశ్వరి, భైరవి, చిన్న మస్తా, ధుమవతి, బగళాముఖీ, మాతంగి , కమల దేవాలయాలు.
తంత్ర సాధన చేసే భక్తులకు ఇది ముఖ్యమైన యాత్రా స్థలం. కోల తంత్ర సాధన చేసే భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాళికా పురాణం ప్రకారం కామాఖ్య భక్తుల కోరికలను తీర్చేదిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించేదిగా వర్ణించారు.
కాళికా పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని కోసం సతీదేవి ( sati devi)తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది. అంతేకాదు శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని భాగం పడిపోయిన స్థలం కూడా.
నరకాసురుడు కట్టించిన ఆలయం
నరకాసురుడు ( Narakasur) కామాఖ్య అమ్మవారికి ఆలయాన్ని కట్టించి, పూజలు చేసేవాడు. నరకాసురుడి వధ తరువాత ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొన్న ఈ ఆలయాన్ని క్రీ.శ 8- 17 వ మధ్యకాలంలో అనేకసార్లు పునర్నిర్మించారు.
కామాఖ్య ఆలయంలో శివుడిని 'ఉమానందుడు' అని పిలుస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేసుకొనే వీలుంటుంది. జంతుబలులు ఇక్కడ సర్వ సాధారణం.
అమ్మవారికి నల్లరంగు అంటే మహా ఇష్టం. అందుకే అన్ని నల్ల రంగు జంతువులనే కోతి, మేక, పావురం, గాడిద లాంటివి బలిగా ఇస్తారు. ఇది ఇక్కడి ఆచారం. అదికూడా మగ జంతువులనే బలిగా ఇస్తారు.
కామాఖ్య అమ్మవారి ఆలయం గురించి మరింత సమాచారం కోసంఈ వీడియో చూడండి
ఎలా రావాలి ? | How To Reach Kamakhya From Hyderabad or Vijayawada ?
భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటైన గువాహటి కామాఖ్య ఆలయానికి ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలందుకుంటున్నారు. దేశంలోనే అరుదైన ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గువాహటి అంతర్జాతీయ ( Guwahati Airport )విమానాశ్రయంగా పిలువబడే లోకప్రియా గోపినాథ్ బొర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉండే ఎయిర్ పోర్ట్. ఇక్కడి నుంచి ఆలయానికి కేవలం 20 కిలోమీటర్ల దూరం.
Hyderabad To Assam By Train Or Flight
హైదరాబాద్ న్యూఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై వంటి మెయిన్ సిటీస్ నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి గువహటికి మీ టికెట్ క్లాసును బట్టి నాలుగున్నర గంటల నుంచి 9 గంటల సమయం పడుతుంది ప్రయాణానికి.
ట్రైన్లో రావాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఎక్కి కోలకత్తా చేరుకోవాలి. తరువాత అక్కడి నుంచి అస్సాంలోని ( assam) గౌహతీకి ట్రైనులో చేరుకోవచ్చు. 48 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుంది.
ఆ ప్రయాణంలో ఉన్న ఇబ్బందులు, ఆనందాల గురించి ఒక వీడియో చేశాను.
ఆ ప్రయాణంలో ఉన్న ఇబ్బందులు, ఆనందాల గురించి ఒక వీడియో చేశాను. లింకు ప్రొవైట్ చేస్తాను చూడండి. మీరు గువహతీ రైల్వే స్టేషన్లో దిగొచ్చు లేదా కామాఖ్య రైల్వే స్టేషన్లో అయినా దిగొచ్చు.
రెండు స్టేషన్ల మధ్య పెద్ద దూరం ఉండదు.ఈ రెండు ష్టేషన్లు ఆలయానికి 6-7 కిమీ దూరంలోనే ఉంటాయి. 300-400 ఇస్తే ఆటో వాళ్లే తీసుకెళ్తారు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.