జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్లైన్ నెంబర్లను జారీ చేసింది.
ముఖ్యాంశాలు
చిక్కుకున్న తెలంగాణ వాసులు | Telangana Tourists Stranded in Kashmir
పహల్గామ్లో (Pahalgam) జరిగిన ఉగ్ర దాడుల తరువాత అధికారులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో 80 మంది తెలంగాణ వాసులు అక్కడ చిక్కుకున్నారు. ఇందులో హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండకు చెందిన కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి.
అక్కడ ఉన్న తెలంగాణ వాసులు ఈ విషయాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.
వేగంగా స్పందించిన ప్రభుత్వం | TG Govt Prompt Response
కాశ్మీరులో తెలంగాణ వాసుల పరిస్థితి తెలుసుకున్న టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వెంటనే రంగంలోకి దిగారు. వారిని వేగంగా, సురక్షితంగా స్వస్థలానికి రప్పిస్తామన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan New Delhi) అధికారులతో తెలంగాణ టూరిజం (telangana tourism dept) విభాగం చురుగ్గా సమన్వయం చేసుకుంటోంది.
హెల్ప్ లైన్ నెంబర్లు
Telangana Helpline Numbers Tourists in Kashmir : లోయలో చిక్కుకున్న తెలంగాణ వాసులు డైరక్టుగా సంప్రదించే విధంగా హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెంబర్లకు టూరిస్టులు మాత్రమే కాకుండా వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా సంప్రదించవచ్చు.
- 9440816071
- 9010659333
- 040 23450368
న్యూ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో కూడా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సహాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు.
- వందన : 9871999044
- హైదరా అలి నఖ్వీ : 997138750013
ఈ వార్త అప్డేట్ అవుతోంది…
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.