Telangana Tourism : అదిరిపోయే టూర్ ప్యాకేజ్..హైదరాబాద్ నుండి రామప్పకు.. వరంగల్ మీదుగా రెండు రోజుల యాత్ర!

షేర్ చేయండి

Telangana Tourism : తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం ఒక శుభవార్త చెప్పింది. ‘హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్’ (Hyderabad-Warangal-Kakatiya-Ramappa Heritage Tour) పేరుతో రెండు రోజుల కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా యాదాద్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను రెండు రోజుల్లో చుట్టిరావచ్చు. ప్రతి వీకెండ్ శనివారం ఈ టూర్ ఉంటుంది. మరి ఈ టూర్ విశేషాలు, ధరలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

మొదటి రోజు టూర్ ప్లాన్: భువనగిరి నుండి వరంగల్ వరకు
మొదటి రోజు టూర్ ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని ఐఆర్‌వో కార్యాలయం (IRO Office) నుండి బస్సు బయలుదేరుతుంది.

Prayanikudu
  • ఉదయం 8:00 – 8:30 గంటలు: భువనగిరి కోటను సందర్శిస్తారు. ఇక్కడ మీరు కోట అందాలను ఆస్వాదించవచ్చు.
  • ఉదయం 9:00 – 9:45 గంటలు: యాదగిరిగుట్ట చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
  • ఉదయం 11:00 – 11:30 గంటలు: జైన దేవాలయాన్ని చూస్తారు.
  • మధ్యాహ్నం 12:00 గంటలు: పెంబర్తి హస్తకళల షాపింగ్ కోసం సమయం కేటాయిస్తారు.
  • మధ్యాహ్నం 1:30 గంటలు: హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో చెక్-ఇన్ అయ్యి, లంచ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
  • సాయంత్రం 4:00 – రాత్రి 8:30 గంటలు: వెయ్యి స్తంభాల గుడి , భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత వరంగల్ కోటలో జరిగే సౌండ్ అండ్ లైట్ షో (Sound & Light Show) చూస్తారు.
  • రాత్రి 9:00 గంటలు: హోటల్‌కి తిరిగి వచ్చి డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
Prayanikudu

ఇది కూడా చదవండి : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు? 

రెండో రోజు టూర్ ప్లాన్: రామప్ప నుండి లక్నవరం మీదుగా హైదరాబాద్!

  • రెండో రోజు ఉదయం టిఫిన్ చేశాక, 8 గంటలకు బయలుదేరి రామప్ప వైపు వెళ్తారు.
  • ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 గంటలు: రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ పడవ విహారం (Boating) చేసి, లంచ్ చేస్తారు.
  • మధ్యాహ్నం 2:00 – 3:00 గంటలు: లక్నవరం చేరుకుని అక్కడ పడవ విహారం చేసి, లక్నవరం సరస్సు అందాలను ఆస్వాదిస్తారు. అక్కడి నుండి తిరిగి బయలుదేరుతారు.
  • సాయంత్రం 5:00 గంటలు: హన్మకొండలోని హరిత హోటల్‌లో టీ మరియు స్నాక్స్ బ్రేక్ తీసుకుంటారు.
  • సాయంత్రం 5:30 గంటలు: సికింద్రాబాద్‌కి తిరిగి బయలుదేరుతారు.
  • రాత్రి 9:00 గంటలు: సికింద్రాబాద్ చేరుకోవడంతో మీ రెండు రోజుల టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
Prayanikudu

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ప్యాకేజీ ధరలు: ఏసీ బస్సులో సౌకర్యవంతమైన ప్రయాణం!

తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీ ధరలను ఇలా నిర్ణయించింది:
పెద్దలకు (Adults): రూ. 3,449
పిల్లలకు (Children): రూ. 2,759
ఈ టూర్ మొత్తం ఏసీ మినీ కోచ్ బస్సులో ఉంటుంది. ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. చరిత్ర, ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ టూర్ ప్యాకేజ్ మంచి అవకాశం.

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!