ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమోటివ్ (ట్రైన్ ఇంజిన్లు) యూనిట్లను తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ.
ముఖ్యాంశాలు
మేకిన్ ఇండియా విజయం | Locomotive Production
భారత్ సాధించిన ఈ ఘనత అనేది మేక్ ఇండియా (Make In India) కార్యక్రమం సాధించిన విజయానికి ప్రతీకగా భావించవచ్చు. అంతే కాదు లోకోమోటీవ్ ఉత్పత్తిలో భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది.
- గత సంవత్సరంతో పోల్చితే లోకోమోటివ్ ఉత్పాదనలో ఏకంగా 19 శాతం పెరుగుదల కనిపించింది.
- గతంలో 1,472 యూనిట్లను ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం ఆ సంఖ్య 1,681కి పెరిగింది.
ప్రశంసలు..సవాళ్లు

విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించి స్వదేశీ సాంకేతికతతో ఉత్పాదక కొనసాగించి అధిక ఉత్పాదకత సాధించాలనుకున్న భారత్ కల ఇలా సాకారం అవుతోంది. మేక్ ఇన్ ఇండియా అంతర్జాతీయంగా ప్రస్తుతం చర్చల్లో ఉంది.
- గతంలో ఒకసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మేక్ ఇండియాను ప్రశంసించాడు.
- ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రవేశ పెట్టనున్న టారీఫ్లకు ముందు…మేక్ ఇండియా అనే విధానం తమకు ఒక సవాలుగా మారిందని అమెరికా అధికారులు తెలిపారు.
2014 నుంచి కథ మారింది…వేగం పెరిగింది

2004 నుంచి 2014 వరకు భారత దేశంలో మొత్తం 4,695 లోకోమోటీవ్స్ తయారు అయ్యాయి. వీటి సగటు సంవత్సరానికి 470 యూనిట్స్గా ఉండేది. అయితే నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
- 2014-2024 వరకు భారత దేశంలో 9,168 లోకోమోటీవ్స్ తయారు అయ్యాయి.
- వార్షిక సగటు 470 నుంచి 917 యూనిట్లకు పెరిగింది.
- ఈ లెక్కన చూసుకుంటే భారత్ భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు సాధించనుందో ఊహించవచ్చు.
వివిధ ఉత్పత్తి కేంద్రాల్లో తయారైన యూనిట్ల సంఖ్య
- చిత్తరంజన్ లోకోమోటీవ్ వర్క్స్ : 700 యూనిట్లు
- బనారస్ లోకోమోటివ్స్ వర్క్స్ : 477 యూనిట్లు
- పటియాలా లోకోమోటివ్స్ వర్క్స్ : 304 యూనిట్లు
- మాదేపురా లోకోమోటివ్స్ వర్క్స్ : 100 యూనిట్లు
- మర్హౌరా లోకోమోటివ్స్ వర్క్స్ : 100యూనిట్లు
ఇందులో ఎక్కువ శాతం లోకోమోటీవ్స్ను సరుకు రవాణ కోసం (freight trains) తయారు చేశారు. అనేక ఇతర శ్రేణి యూనిట్లతో పాటు అత్యధికంగా WAG-9/H శ్రేణికి చెందిన 1,047 యూనిట్ల లోకోమోటీవ్స్ను ఉత్పత్తి చేశారు.
సరికొత్త శఖానికి నాంది
రైల్వే ఇంజినీరింగ్లో (Railway Engineering) భారత దేశం సరికొత్త శఖానికి నాంది పలికింది. పెరుగుతున్న రైల్వే లోకోమోటీవ్స్ యూనిట్ల సంఖ్య వల్ల రైల్వే కనెక్టివిటీతో పెరుగుంది. ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఉత్పాదక రంగంలో మరింత మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.