ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహా కుంభ మేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వెళ్తున్నారు. దూరదూరం నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభ మేళా ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి ( Kumbh Mela 2025 Last Date ) వరకు కొనసాగుతుంది. ఈ మేళాకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అని అధికారుల అంచనా వేస్తున్నారు.
ముఖ్యాంశాలు
కుంభ మేళాలో తెలుగువారు | Telugu People In Maha Kumbh Mela 2025
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రైళ్లు, విమానాలు, సొంత వాహానాల్లో కుంభ మేళాకు వెళ్తున్నారు. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రావాణ సంస్థ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. విజయవాడ నుంచి ఫిబ్రవరి 1న బయల్దేనున్నాయి కొన్ని బస్సులు. మరోవైపు కాకినాడ నుంచి కూడా ప్రయాగ్రాజ్ వెళ్లనున్నాయట కొన్ని బస్సులు.
కాకినాడ నుంచి కూడా | Kakinada To Kumbh Mela APSRTC Busses
విజయవాడ నుంచే కాకుండా కాకినాడ నుంచి కూడా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపుతున్నారు ఆర్టీసి అధికారులు. ఈ బస్సులు జనవరి 31వ తేదీ నుంచి ప్రయాణం మొదలుపెడతాయి. మొత్తం 7 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులు భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగ్రాజ్ ( Prayagraj ), వారణాసి , గయా, బుద్ధ గయా, త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథుడుని దర్శన, గయా క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇక వారణాసి, ప్రయాగ్రాజ్లో భక్తులు ఒక రోజు బస చేయవచ్చు.

ఈ సమయంలో భక్తులు కుంభ మేళా వైభవాన్ని చూడవచ్చు. అక్కడ త్రివేణి సంగమంలో ( Triveni Sangam ) పవిత్ర నదీ స్నానం అచరించవచ్చు. కుంభమేళాలో నదీస్నానం అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఈ సమయంలో నదీ స్నానం వల్ల మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు.
ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Kakinada to Kumbh Mela Busses
కుంభ మేళా వెళ్లాలి అనుకునే భక్తుల కోసం పలు బుకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం. దీని కోసం మీరు ఈ కింది వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
https://www.apsrtconline.in లేదా www.apsrtconline.in
ఈ వెబ్సైట్కు లాగిన్ అయ్యాక మీరు ఎక్కడి నుంచి బస్సు ఎక్కాలని అనుకుంటున్నారు, గమస్థానం, తేదీలు వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత మీరు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీన మధ్యాహ్నం ఈ బస్సు కాకినాడ నుంచి కుంభమేళాకు బయల్దేరనుంది.
టికెట్ ధర, వసతి | Ticket Cost
ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అందించన్నారు. ఈ ప్యాకేజీ ధర వచ్చేసి రూ. 9,900. ఒక వేళ గ్రూప్ ట్రావెల్ చేయాలి అనుకుంటే వారి కోసం ప్రత్యేక బస్సులు నడపునున్నట్టు కాకినాడ జిల్లా ప్రజారవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.
మరింత సమాచార కోసం మీరు ప్రయాణికులు సంప్రపదించాల్సిన నెంబర్లు: 7382910869, 7382910778.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.