IRCTC : భక్తులకు, పర్యాటకులకు వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఐఆర్సీటీసీ టూరిజం ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి ‘TIRUPATI FROM KARIMNAGAR’ అని పేరు పెట్టారు. ఈ టూర్లో కేవలం తిరుపతి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాల్లోని ముఖ్యమైన దేవాలయాలు కూడా కవర్ అవుతాయి.
ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి?
ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు ఏపీలోని ఈ ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునే అవకాశం ఉంటుంది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి వాయు లింగేశ్వరుడి ఆలయం, తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, తిరుపతిలో వసతి సౌకర్యాలు కవర్ అవుతాయి.

ప్రయాణ స్టేషన్లు
ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణం జూన్ 19వ తేదీ, 2025న అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఈ తేదీని మిస్ అయితే, భవిష్యత్తులో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఇతర తేదీలను కూడా తనిఖీ చేయవచ్చు. ఈ ప్యాకేజీలో ప్రయాణించడానికి భక్తులు కరీంనగర్తో పాటు, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ల నుండి కూడా రైలు ఎక్కే అవకాశం ఉంది.
టూర్ షెడ్యూల్ వివరాలు
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం 3 రోజులు, 2 రాత్రులు ఉంటుంది. షెడ్యూల్ ఇలా ఉంటుంది:
మొదటి రోజు (Day 1 – జూన్ 19, 2025)
రాత్రి 07:15 గంటలకు: కరీంనగర్ నుంచి (ట్రైన్ నంబర్ 12762) రైలు బయల్దేరుతుంది.
రాత్రి 08:05 గంటలకు: పెద్దపల్లి స్టేషన్ వద్ద ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు.
రాత్రి 09:15 గంటలకు: వరంగల్ వద్ద రైలు చేరుకుంటుంది.
రాత్రి 11:00 గంటలకు: ఖమ్మం వద్ద రైలు చేరుకుంటుంది.
రాత్రి మొత్తం రైలు ప్రయాణంలో ఉంటారు.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
రెండవ రోజు (Day 2 – జూన్ 20, 2025):
ఉదయం 07:50 గంటలకు: తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు.
హోటల్లో చెకిన్ అయ్యి, ఫ్రెష్ అప్ అవుతారు.
అక్కడి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తారు.
తర్వాత శ్రీకాళహస్తికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు.
రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.
మూడవ రోజు (Day 3 – జూన్ 21, 2025):
తెల్లవారుజామునే: తిరుమలకు చేరుకుంటారు.
క్యూ లైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్తారు.
సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు.
రాత్రంతా తిరిగి రైలు ప్రయాణంలో ఉంటారు.
నాలుగవ రోజు (Day 4 – జూన్ 22, 2025):
తెల్లవారుజామున 03:26 గంటలకు: ఖమ్మం చేరుకుంటారు.
ఉదయం 04:41 గంటలకు: వరంగల్ చేరుకుంటారు.
ఉదయం 05:55 గంటలకు: పెద్దపల్లి చేరుకుంటారు.
ఉదయం 08:40 గంటలకు: కరీంనగర్ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు
ఈ టూర్ ప్యాకేజీ ధరలు, మీరు ఎంచుకునే క్లాస్ (కంఫర్ట్/స్టాండర్డ్), షేరింగ్ (సింగిల్/డబుల్/ట్రిపుల్) ఆధారంగా మారుతాయి
కంఫర్ట్ క్లాస్ (Comfort Class – 3AC):
సింగిల్ షేరింగ్: రూ. 14,030
డబుల్ షేరింగ్: రూ. 10,940
ట్రిపుల్ షేరింగ్: రూ. 9,160
ఇది కూడా చదవండి : Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు
స్టాండర్డ్ క్లాస్ (Standard Class – స్లీపర్):
సింగిల్ షేరింగ్: రూ. 12,120
డబుల్ షేరింగ్: రూ. 9,030
ట్రిపుల్ షేరింగ్: రూ. 7,250
పిల్లలకు ధరలు: 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా (బెడ్ సదుపాయం ఉంటే/లేకుంటే) వేర్వేరు టికెట్ ధరలు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా సంప్రదింపు నంబర్లలో తెలుసుకోవచ్చు.
ప్యాకేజీలో ఏమేమి కవర్ అవుతాయి?
ఈ టూర్ ప్యాకేజీలో కింది సదుపాయాలు కవర్ అవుతాయి. రైలు టికెట్లు, తిరుపతిలో రాత్రి బసకు హోటల్ రూమ్, తిరుమల శ్రీవారి దర్శనం టికెట్, ఆలయాలకు వెళ్లడానికి నాన్-ఏసీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ (బస్సు లేదా టెంపో ట్రావెలర్) సదుపాయం.
ఏమేమి కవర్ అవవు?
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ఆహార ఖర్చులు ప్యాకేజీలో కవర్ అవవు. ప్రయాణికులే తమ ఆహార ఖర్చులను భరించాలి. ఆలయ ప్రవేశ రుసుములు (తిరుమల దర్శనం మినహా), వ్యక్తిగత షాపింగ్, స్నాక్స్, టీ/కాఫీ వంటి ఖర్చులు కవర్ అవవు. ప్యాకేజీకి సంబంధించిన కొన్ని షరతులు ఉండవచ్చు, వాటిని ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా బుకింగ్ సమయంలో తెలుసుకోవాలి.
ఈ టూర్ ప్యాకేజీ గురించి ఏమైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే, మీరు ఐఆర్సీటీసీ టూరిజం అధికారులను 9701360701 / 9281030712 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే, ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.