IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour). ఈ ప్యాకేజీ కోడ్ SHR029 తో రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ మొత్తం రైలులో కొనసాగుతుంది. స్లీపర్ (SL), థర్డ్ ఏసీ (3AC) బోగీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్రతి శుక్రవారం రాత్రి 08:30 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్లో కూడా పికప్ పాయింట్ ఉంది.
టూర్ షెడ్యూల్: 3 రోజులు, 2 రాత్రులు
డే 01 (శుక్రవారం):
రాత్రి 08:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి 12738 (గౌతమి ఎక్స్ప్రెస్) రైలులో బయలుదేరాలి. సికింద్రాబాద్ నుంచి రాత్రి 09:15 గంటలకు పికప్ ఉంటుంది. రాత్రంతా రైలులో ప్రయాణం సాగుతూనే ఉంటుంది.

డే 02 (శనివారం):
తెల్లవారుజామున 04:38 గంటలకు రాజమండ్రి స్టేషన్కు చేరుకుంటారు. హోటల్లో చెక్-ఇన్ చేసి, ఫ్రెష్ అవ్వాలి. ఆ తర్వాత, రాజమండ్రి నుండి 80 కి.మీ దూరంలో ఉన్న అన్నవరం (Annavaram)కు బయలుదేరి, శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడి ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా తీసుకోవాలి. సాయంత్రం రాజమండ్రికి తిరిగి వచ్చి, గోదావరి ఘాట్ (Godavari Ghat), ఇస్కాన్ దేవాలయం (ISKCON Temple) సందర్శిస్తారు. ఈ రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
డే 03 (ఆదివారం):
హోటల్ నుండి చెక్-అవుట్ చేసి, అంతర్వేది (Antarvedi)కి బయలుదేరుతారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత బీచ్ను (Beach) సందర్శిస్తారు. ఆ తర్వాత, అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ దేవాలయం (Sri Bala Balaji Temple, Appanapalle), విఘ్నేశ్వర దేవాలయం (Vigneshwara Temple, Ayanavalli) సందర్శిస్తారు. సాయంత్రం ద్రాక్షారామం దేవాలయాన్ని (Draksharamam Temple) దర్శించుకుంటారు. రాత్రి 08:18 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. 12737 (గౌతమి ఎక్స్ప్రెస్) రైలులో తిరిగి ప్రయాణమవుతారు.
సడే 04 (సోమవారం):
రాత్రంతా ప్రయాణించి, సోమవారం తెల్లవారుజామున 04:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఉదయం 05:55 గంటలకు లింగంపల్లికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ధరలు – మీ బడ్జెట్కు తగినట్టుగా ఉంటాయి.

ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు ప్రయాణికుల సంఖ్య, సెలక్ట్ చేసుకున్న క్లాస్ బట్టి మారుతుంటాయి.
1 నుండి 3 మంది ప్రయాణికులైతే (per person):
కంఫర్ట్ (3AC):
సింగిల్ షేరింగ్: రూ.15,340
ట్విన్ షేరింగ్: రూ.8,940
ట్రిపుల్ షేరింగ్: రూ.7,170
పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్తో: రూ.6,080
పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్ లేకుండా: రూ.4,960
స్టాండర్డ్ (SL):
సింగిల్ షేరింగ్: రూ.13,800
ట్విన్ షేరింగ్: రూ.7,400
ట్రిపుల్ షేరింగ్: రూ.5,630
పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్తో: రూ.4,540
పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్ లేకుండా: రూ.3,420
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
4 నుండి 6 మంది ప్రయాణికులైతే (per person):
కంఫర్ట్ (3AC):
ట్విన్ షేరింగ్: రూ.7,440
ట్రిపుల్ షేరింగ్: రూ.6,630
పిల్లలు (5-11 ఏళ్లు) ధరలలో మార్పు లేదు (పైన ఇచ్చినవే).

స్టాండర్డ్ (SL):
ట్విన్ షేరింగ్: రూ.5,900
ట్రిపుల్ షేరింగ్: రూ.5,630
పిల్లలు (5-11 ఏళ్లు) ధరలలో మార్పు లేదు (పైన ఇచ్చినవే).
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆస్వాదించండి!
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.