Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

షేర్ చేయండి

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

జనవరి 29వ తేదీ నుంచి భక్తులు అయోధ్యకు అధిక సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాలో పవిత్ర స్నానం ఆచరించిన భక్తులే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు.

ఆధ్యాత్మిక సంద్రం | Devotees Flock To Ayodhya 

అయోధ్యా నగరానికి భారీ స్థాయిలో భక్తుల తాకిడి పెరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా అయోధ్యా నగరంలోని వీధులు భక్తులో కిటకిటలాడాయి. పగలు రాత్రి అనే తేడాలు లేకుండా భక్తులు అయోధ్యాకు చేరుకోవడం, బాల రాముడిని  ( Ram Lalla ) దర్శించుకోవడం చేస్తున్నారు అని అక్కడి అధికారులు తెలిపారు. 

వేకువ జామునే జైశ్రీరామ్ ( Jai Shree Ram ) అనే నినాదాలు చేస్తూ సాటి భక్తుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు కొంత మంది భక్తులు. సాధారణంగా ప్రతీ రోజు 3 లక్షల మంది భక్తులు అయోధ్యా బాల రాముడిని, స్థానికంగా ఉన్న హనుమాన్‌గర్హీలో ( Hanumangarhi ) ఆంజనేయుడిని దర్శంచుకుంటారు. కుంభ మేళా సందర్భంగా ఈ సంఖ్య పెరగడంతో అధికారులు దర్శన సమయాన్ని18 గంటలకు పెంచారు. 

భక్తుల కోసం తగిన ఏర్పాట్లు | Arrangements For Devotees In Ayodhya

Lord Rama Face In Ayodhya Temple

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) ముందే అధికారులకు తెలిపారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయమని ఆయన అధికారులకు సూచించారు. అంతే కాకుండా ఏర్పాట్లను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. తరువాత ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. 

ఇక స్థానిక సీనియర్ అధికారులు, ముఖ్యంగా లఖ్‌నవు జోన్ డైరక్టర్ జనరల్ ఎస్‌బీ శిరోద్కర్ దగ్గరుండి మరీ ఏర్పాట్లు, సిబ్బంది పని తీరును చెక్ చేస్తున్నారు. నగరంలో జరిగే ఏర్పాట్లను చెక్ చేసి రద్దీని మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.

  • మెడికల్ క్యాంపులు : బాల రాముడి ఆలయం పరిసరాల్లో వైద్య అవసరాల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు
  • తాగు నీటి పంపిణి : ఎక్కువ సమయం క్యూ లైన్ల నిలబడే భక్తుల కోసం మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు.
  • ప్రత్యేక మార్గాలు : భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేగంగా దర్శనం చేసుకునేందుకు వీలుగా గోండా, అంబేడ్కర్ నగర్, సుల్తాన్‌పూర్, లఖనవు నగరాల్లోని వీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • ప్రయాగ్‌రాజ్‌లో 22 సందర్శనీయ ప్రదేశాలు | 22 Places To Visit In Prayagraj

సాంస్కృతిక విశిష్టత | Cultural Significance of Ayodhya

అయోధ్యా ( Ayodhya City ) నగరానికి ఉన్న చరిత్ర, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టత వల్లే ఇంత మంది భక్తులు ఈ నగరానికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడి సరయు నదిలో ( Saryu River ) స్నానం ఆచరిస్తారు. తరువాతే ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. మహాకుంభ మేళా సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చే భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam ) వద్ద పవిత్ర స్నానాలు ఆచరించి తరువాత అయోధ్య, కాశీ నగరాలకు వెళ్తున్నారు. 144 సంవత్సాలకు ఒకసారి వచ్చే ఈ మేళాలో మొత్తం 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయోధ్యా రామ మందిరం  | Significance Of Ram Lalla Temple In Ayodhya

భారత దేశంలో అయోధ్య రాముడి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇక్కడికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. మౌనీ అమావాస్య సందర్భంగా కేవలం నాలుగు రోజుల్లో 96 లక్షల మంది బాల రాముడిని దర్శించుకున్నారు. ఈ స్థాయిలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం అనేది భారత దేశ వారసత్వానికి ( Indian Heritage ) ప్రతీకగా చెప్పవచ్చు. ఇక మీరు కూడా అయోధ్యా బాల రాముడిని దర్శించుకోవడానికి ప్లాన్ చేస్తోంటే ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!