Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్‌ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.

షేర్ చేయండి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.

పెరిగిన కనెక్టివిటి | Increased Flight Connectivity

Air travel to Prayagraj : ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు విమానంలో వెళ్లే వారి సంఖ్య చాలా పెరిగింది. దీంతో కుంభ మేళా వెళ్లే విమానాల కనెక్టివిటీ కూడా చాలా పెరిగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుంది. రైళ్లు, ఫైట్స్ డిమాండ్ బాగా పెరిగింది. వీటి సంఖ్య కూడా బాగా పెరిగింది.

ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు నెలకు 132 విమానాలు వెళ్తున్నాయి. ఇందులో 80,000 సీట్లు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. దేశంలోని 17 నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ఉన్నాయి. 2024 డిసెంబర్‌లో ఈ సంఖ్య కేవలం 8 గా ఉండేది. 

స్పందించిన ఇండిగో | IndiGo Takes Action

India China Direct Flights
| విమాన టికెట్ ధరలను తగ్గించిన ఇండిగో

Indigo Flight Ticket Prices Drops To Prayagraj : విమాన ధరల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో భారత దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో టికెట్ ధరల్లో మార్పు చేయనున్నట్టు ప్రకటించింది. ధరల్లో 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపు చేయనున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమాన టికెట్ ధర గతంల రూ.21,200 ఉంటే అది రూ.13,500కు తగ్గనుంది. మారిన ఈ కొత్త ధరలు 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 16 వరకు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల భారీ సంఖ్యలో కుంభ మేళాకు వెళ్లే ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గనుంది. 

రంగలోకి ప్రభుత్వం |

Government Oversight On Airfares To Prayagraj Flights : పెరిగిన ఫ్టైట్ టికెట్ల ధరలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. భారీగా పెరిగిన ధరల వల్ల కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) వెళ్లాలని భావిస్తోన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఆయన. వియోగదారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అని,  ఈ విషయంలో పౌరవిమానయాన డైరక్టరేట్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఎయిర్‌లైన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఫ్లైట్ ధరలు తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా..| Airfares For Prayagraj

మహాకుంభ మేళాకు లక్షలాది మంది భక్తులు రోజూ తరలి వెళ్తున్నారు . ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇండిగో టికెట్ ధరలు తగ్గించడం ఇవన్నీ కూడా భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని తక్కువ ధరకే కల్పించడంలో భాగం అని చెప్పవచ్చు. కనెక్టివిటీ పెంచడంతో పాటు ధరలు అందుబాటులో ఉంటేనే అధిక సంఖ్యలో భక్తులు అరుదైన మహా కుంభ మేళాకు వెళ్లగలరు. దీని వల్ల భక్తులకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మేలు జరుగుతుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!