Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

షేర్ చేయండి

Sabari Rail : కేరళలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మంజూరైన 111 కిలోమీటర్ల పొడవైన అంగమాలి-ఎరుమేలి శబరి రైలు ప్రాజెక్ట్ చివరకు ముందుకు సాగుతోంది. రాష్ట్ర రైల్వే మంత్రి వి. అబ్దురహిమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1997-98లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జూలై నుండి భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.

భూ లావాదేవీలపై ఆంక్షలు తొలగింపు!
ఈ 111 కిలోమీటర్ల రైలు ప్రాజెక్టులో 70 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 5,510 కుటుంబాలకు ఇది భారీ ఊరటనిచ్చింది. ఎందుకంటే, గతంలో వారి ఆస్తులను సర్వే చేసి, సర్వే రాళ్లను నాటిన తర్వాత ఎటువంటి భూ లావాదేవీలు నిర్వహించడానికి వారికి అనుమతి లేదు. “ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలనుకుంటోంది. దానిని నెరవేర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. కేంద్ర మంత్రి, రైల్వే బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో జరిగిన ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశ నిర్ణయాల ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కారం లభించింది” అని మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు.

Prayanikudu

నిధుల సమస్యలు పరిష్కారం
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి రుణం కోరినప్పుడు ఆ మొత్తం రెగ్యులర్ రుణాల్లో కలిపిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించి ప్రత్యేక రుణాన్ని కోరింది. “రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని భరించాలని నిర్ణయించుకుంది. నిధుల సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తాం” అని అబ్దురహిమాన్ అన్నారు. కేరళలో భూమి ఖర్చు చాలా ఎక్కువ కావడం పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. “మరొక రాష్ట్రంలో, ప్రాజెక్టు కోసం భూమిని సేకరించడానికి అవసరమైన మొత్తం రాష్ట్ర వాటాలో కేవలం 15శాతం మాత్రమే అవుతుంది. కేరళలో ఇది 30శాతం కంటే ఎక్కువ” అని మంత్రి వివరించారు.

ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !

అభివృద్ధికి ఊతం
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.వి థామస్ మాట్లాడుతూ ప్రాజెక్టు కొనసాగింపుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర, రైల్వే బోర్డు కలిసి రూపొందిస్తాయని చెప్పారు. “ప్రాజెక్టు అమలుకు అవసరమైన పూర్తి అవగాహన వారికి ఉంది” అని ఆయన అన్నారు. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు నుండి నిధులు సమకూర్చుకోవచ్చని కూడా ఆయన సూచించారు.

శబరి రైలు యాక్షన్ కౌన్సిల్ ఫెడరేషన్ సభ్యుడు జిజో పి మాట్లాడుతూ.. మొత్తం మార్గంలో 58 కిలోమీటర్ల వరకు అంటే తొడుపుజా వరకు ప్రాజెక్టు కోసం సామాజిక ప్రభావ అధ్యయనం (Social Impact Study) నిర్వహించబడిందని తెలిపారు. “మిగిలిన మార్గంలో శాటిలైట్ సర్వే మాత్రమే జరిగింది. రైలు ప్రాజెక్టు అమలు కేరళకు పెద్ద ప్రోత్సాహాన్నిస్తుంది” అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి

రవాణాకు, పరిశ్రమలకు ప్రయోజనం
ప్రయాణికులతో పాటు, ఎర్నాకులం, కొట్టాయం, పతనంతిట్ట, ఇడుక్కిలలో ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను రైలు ద్వారా తరలించగలవు. ఇది భారీగా వారి డబ్బులు ఆదా చేస్తుంది. అంతేకాకుండా, పతనంతిట్టలోని పునలూర్ మీదుగా నెడుమంగాడ్ ద్వారా శబరి రైలును విజినం పోర్టుకు అనుసంధానించే ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ముందు ఉంచింది. ఇది కేరళ రవాణా, లాజిస్టిక్స్ రంగానికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.

శబరి రైలు – కీలక వివరాలు:

  • రైల్వే లైన్ పొడవు: 111 కి.మీ.
  • మొత్తం ఖర్చు: రూ.3,801 కోట్లు (డిసెంబర్ 2023లో సవరించిన అంచనా).
  • శబరి రైలులో 14 స్టేషన్లు:
  • అంగమాలి జంక్షన్: ఇప్పటికే ఉన్న రైల్వే స్టేషన్.
  • కలాడి: రైల్వే స్టేషన్ నిర్మించబడింది.
  • పెరుంబవూర్ ఒడక్కాలి
  • కొత్తమంగళం మూవట్టుపుజా వాళకులం
  • తొడుపుజా కరింకున్నం
  • రామపురం భరణంగానం
  • చెమ్మాళంమట్టం
  • కంజిరపల్లి రోడ్ ఎరుమేలి

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!