Ooty’s E Pass : టూరిస్టులు ఊటి వరకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు ?

షేర్ చేయండి

సమ్మర్‌లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…

క్వీన్ ఆఫ్ నీల్‌గిరిస్‌గా (Queen of the Nilgiris) పిలుచుకునే ఊటి అనేది ఎండాకాలంలో చాలా మందికి స్వర్గంలా కనిపిస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఈ హిల్ స్టేషన్‌కు (Hill Stations) వెళ్తుంటారు. అలా వెళ్తున్న పర్యాటకులను అక్కడి ఈ పాస్ సిస్టమ్ తలనొప్పిగా మారింది. 

దీని వల్ల గంటల కొద్ది క్యూలో ఉండాల్సి వస్తోంది. దీంతో పర్యాటకులకు చిరాకు పెరిగి ఊటిలోకి ఎంటర్ అవ్వకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా పర్యాటకుల (Tourists) సంఖ్య తగ్గడంతో స్థానిక వ్యాపారులు ఈ -పాస్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజంగా ఊటి పర్యావరణాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుందా ? లేదా పర్యాటకాన్ని దెబ్బతీస్తోందా ?

ఎంట్రీ పాయింట్‌ నుంచే ఎగ్జిట్ | Ooty’s E Pass

ఈ పాస్ సిస్టమ్‌‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి పట్టావయాల్ నంబియాకున్ను, తాలూరు, చెలోడి, నడుకని చూరం వంటి ప్రాంతాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పాస్ గురించి తెలియకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు భారీ క్యూలైన్‌తో విసిగిపోతున్నారు.

అధికారులు ఈపాస్‌లను చెక్ చేసేందుకు తీసుకుంటున్న సమయం పర్యాటకులలో ఉన్న ఉత్సాహాన్ని తగ్గిస్తోంది అంటున్నారు. కొంత మంది కోపంతో వెనక్కి వెళ్లిపోతున్నారు.

Ooty's E Pass

స్థానిక వ్యాపారుల్లో ఆగ్రహం 

ఈ పాస్ సిస్టమ్ వల్ల ఊటికి పర్యటకుల తాకిడి తగ్గి, స్థానిక వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. దీనికి నిరసనగా కొన్ని రోజుల ముందు ఈ వ్యాపారులు 24 గంటల పాటు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ పాస్ వల్ల వారి ఆదాయం తగ్గింది అని దీనిని వెనక్కి తీసుకోవాలని కోరారు.

అదే సమయంలో ఈ పాస్ సిస్టమ్ విధానాన్ని పున: పరిశీలించాల్సిందిగా మద్రాస్ హైకోర్టును కోరింది తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వం. ఇది టూరిజంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ఇబ్బంది పెడుతోంది అని తెలిపింది ప్రభుత్వం.

ఈ పాస్ లేకుండా వెళ్లడం ఎలా ? | Tamil Nadu Hill Stations

ఊటి (Ooty) వెళ్లాలని భావించే పర్యాటకులు ఈ పాస్ అనేది తప్పనిసరి అని తెలుసుకోవాలి. దీని కోసం మీరు ఈ కింది వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పాస్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది

వెబ్‌సైట్‌ను విజిట్ చేసిన తరువాత మీ వ్యక్తిగత సమాచారం, వాహన వివరాలు, ఎన్నిరోజులు ఉంటారు అనే వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ పాస్ అవసరం లేకుండా వెళ్లాలి అనుకుంటే ఈ ఆ కింది ఆప్షన్స్ ప్రయత్నించవచ్చు.

  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ : తమిళనాడు ఆర్టీసి బస్సులో (Tamil Nadu RTC) ప్రయాణించవచ్చు.
  • ట్రైన్‌లో : నీల్‌గిరి ట్రైన్‌లో కూడా మీరు ప్రయాణించవచ్చు.
  • షటిల్ సర్వీస్ : రెస్ట్రిక్టెడ్ జోన్‌‌కు ముందు బండి ఎక్కడైనా పార్క్ చేసి షటిల్ సర్వీసులో ప్రయాణించడం.
  • నడవడం : ఇవన్నీ కాదు అనుకుంటే నడుచుకుంటూనే వెళ్లి బోటానికల్ గార్డెన్, ఊటి లేక్‌ (Ooty Lake) ను కవర్ చేయవచ్చు

ఈ పాస్ (Ooty’s E Pass) వ్యవస్థ అనేది అటు ప్రయాణికులకు, ఇటు వ్యాపారులకు ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తూ, పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఈ సిస్టమ్‌లో మార్పులు వస్తే ఊటికి వెళ్లావారి సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!