Andhra Kashmir : ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. లంబాసింగికి రూ. 650కే వన్-డే టూర్ ప్యాకేజీ.. మంచు అందాలను ఆస్వాదించండి!
Andhra Kashmir : చలికాలం (Winter) వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి అందాలు రెట్టింపయ్యాయి. ఆంధ్ర ఊటీ(Andhra Ooty)గా పిలువబడే అరకు, ఆంధ్ర కాశ్మీర్(Andhra Kashmir)గా పేరుగాంచిన లంబాసింగి (Lambasinghi) ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. రాత్రిపూటే కాకుండా పగటిపూట కూడా దట్టమైన మంచు కురుస్తుండటంతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ అద్భుతమైన మంచు అందాలను వీక్షించేందుకు, విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు పర్యాటకుల కోసం లంబాసింగి టూర్ ప్యాకేజీ(Lambasinghi Tour Package) పేరుతో ప్రత్యేక బస్సులను, అతి తక్కువ ధరలో ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
లంబాసింగిలో అద్భుత వాతావరణం
చలికాలం ప్రారంభంతోనే లంబాసింగి ప్రాంతం మంచుతో కప్పిపోయి పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతోంది. ఆంధ్ర ఊటీ, ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన అరకు, లంబాసింగిలో చెట్లు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మంచుతో కప్పిపోయి ఉన్నాయి. గతంలో ఉదయం 7 గంటలకల్లా కనిపించే సూర్యుడు, ఇప్పుడు ఉదయం 10 గంటలైనా కనిపించడం లేదు. పగటిపూట కూడా దట్టమైన మంచు కారణంగా వాహనాలు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టూర్ వివరాలు
ఈ అద్భుతమైన వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా, విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు పిక్నిక్ టూర్ ప్యాకేజీని ప్రకటించారు. కార్తీక మాసం కావడంతో లంబాసింగికి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు ప్రతి శనివారం మరియు ఆదివారం రోజులలో విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ నుంచి తెల్లవారుజామున 03:00 గంటలకు బయలుదేరుతాయి. ఈ వన్-డే టూర్లో లంబాసింగి మంచు అందాలు, తజంగి రిజర్వాయర్, కొత్తపల్లి జలపాతం, పాడేరులోని మోదమాంబ దేవాలయం, కాఫీ తోటలను పర్యాటకులకు చూపిస్తారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
టికెట్ ధరలు, బుకింగ్ విధానం
ఈ టూర్ ప్యాకేజీని అతి తక్కువ ధరలలో అందిస్తున్నట్లు విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పల నాయుడు తెలిపారు.
టికెట్ ధరలు (ఒక్కొక్కరికి):
ఎక్స్ప్రెస్ బస్సు (Express Bus): రూ.650/-
అల్ట్రా డీలక్స్ బస్సు (Ultra Deluxe Bus): రూ.800/-
ఆర్టీసీ అతి తక్కువ ధరలలో ఈ టూర్ అందిస్తుండటంతో, పర్యాటకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్యాకేజీ కావాలనుకునే వారు వెంటనే ఆర్టీసీ డిపోలకు వెళ్లి, తమ పేర్లను నమోదు చేసుకుని టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఒకరోజు టూర్ తర్వాత ఆర్టీసీ పర్యాటకులను సురక్షితంగా వెనక్కి తీసుకు వస్తుంది.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.

💬 Chat on WhatsApp

తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
