Fort Treks India : సాహస ప్రియులకు సవాల్.. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 కోట ట్రెక్కింగ్స్ ఇవే!

షేర్ చేయండి

Fort Treks India : భారతదేశంలోని ప్రాచీన కోటలు కేవలం రాళ్ళు, కథల సమాహారం మాత్రమే కాదు.. అవి సాహసాలకు నెలవులు. కొండల అంచున, అడవుల్లో దాగి, ప్రమాదకరమైన భూభాగంతో ఈ కోటలు అభేద్యంగా నిర్మించబడ్డాయి. మరి వాటిని చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయడమంటే ఓ సవాలే. సాధారణ హిల్ స్టేషన్లు, వీకెండ్ ట్రైల్స్‌తో విసిగిపోయిన సాహసీకులకు వారి శక్తిని, ధైర్యాన్ని పరీక్షించుకునేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 ఫోర్ట్ ట్రెక్కింగుల గురించి వివరంగా తెలుసుకుందాం.

కళావంతిన్ దుర్గ్, మహారాష్ట్ర
పన్వేల్ సమీపంలో 2,300 అడుగుల ఎత్తున ఉన్న కళావంతిన్ దుర్గ్..ఎంత అద్భుతంగా ఉంటుందో, అంతే భయానకంగా ఉంటుంది. ఈ ట్రైల్ రాతి కొండలోకి నేరుగా చెక్కబడిన నిలువు మెట్లను కలిగి ఉంటుంది. ఎటువంటి రెయిలింగ్‌లు లేదా భద్రతా ఏర్పాట్లు ఉండవు. చివరి అంచు కాళ్ళను వణికించి, గుండెను దడదడలాడిస్తుంది. దీనిని “భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన కోట” అని పిలుస్తారు. ఎత్తులకు భయపడని సాహసికులకు ఇది తప్పక చేయాల్సిన ట్రెక్.

Prayanikudu

హరిహర్ ఫోర్ట్, మహారాష్ట్ర
నిలువుగా రాతిలో చెక్కబడిన మెట్లు, పక్కనే ఓ భయంకరమైన లోయ ఉంటుంది.నాసిక్‌లో ఉన్న ఈ ట్రెక్ చిన్నదైనా, విపరీతమైన ఏటవాలుగా ఉంటుంది. 60-70 డిగ్రీల వాలులో ఉన్న 200 అడుగుల ఐకానిక్ రాతి మెట్లు భయానకంగా ఉంటాయి. బలహీనంగా గుండె ఉన్న వాళ్లకు ఇది తగినది కాదు, కానీ పైనుండి కనిపించే విశాల దృశ్యాలు ఖచ్చితంగా శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తాయి.

రతన్‌గడ్ ఫోర్ట్, మహారాష్ట్ర
పచ్చటి భండారా ప్రాంతంలో ఉన్న రతన్‌గడ్, అటవీ మార్గాలను, జారే రాతి ఉపరితలాలను , ఇరుకైన మార్గాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు మార్గం బురదమయంగా మారి, నీరు ప్రవహిస్తుంది. ఇనుప నిచ్చెనలు శిఖరానికి దారినిస్తాయి. అక్కడ సహ్యాద్రి శ్రేణులు కింద విస్తరించి ఉండటాన్ని చూస్తారు. ‘నెధే’ (సూది కన్ను) అని పిలువబడే సహజ రాతి నిర్మాణం కూడా ఉంటుంది.

అలంగ్-మదన్-కులంగ్ (AMK), మహారాష్ట్ర
సహ్యాద్రిలోని అత్యంత కఠినమైన ట్రెక్ అని విస్తృతంగా పరిగణించబడే AMK, మూడు భారీ కోటల సర్క్యూట్. రాపెల్లింగ్ (Rappelling), రోప్ క్లైంబింగ్ (Rope Climbing), కఠినమైన రాతి ఉపరితలాలు, కత్తి అంచు రిడ్జ్‌లు ఇక్కడ ఉంటాయి. ఈ సాహసాన్ని చేయాలంటే పటిష్టమైన పరికరాలు అవసరం, కనీసం రెండు రోజుల సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

రాజ్‌గడ్ నుండి టోర్నా ట్రావర్స్ , మహారాష్ట్ర
శివాజీ వారసత్వంలోని రెండు ఐకానిక్ కోటలను కలిపే 12-15 కిలోమీటర్ల ఈ ట్రావర్స్, దృశ్యపరంగా అద్భుతంగా, శారీరకంగా కఠినంగా ఉంటుంది. జారే రాళ్లను అధిరోహించడం, లోయల్లోకి దిగడం, ఇరుకైన అంచుల గుండా ప్రయాణించడం – ఈ అంతా బలమైన గాలులు , ఊహించని వాతావరణం మిమ్మల్ని అబ్బుర పరుస్తాయి. సాహాసాలను కోరుకునే ట్రెక్కర్లకు ఒక చారిత్రక మార్గం.

కుంభల్‌గఢ్ ఫోర్ట్, రాజస్థాన్
చాలా మంది పర్యాటకులు కుంభల్‌గఢ్‌కు డ్రైవ్ చేసుకుని వెళ్తారు – కానీ నిజమైన సాహసికులు అరవాలీస్ గుండా ట్రెక్ చేస్తారు. ఈ 36 కిలోమీటర్ల పొడవైన ట్రైల్ ప్రపంచంలోనే రెండో పొడవైన గోడ వెంట నడుస్తుంది. పొడి, రాతి భూభాగం, ఏటవాలు ఎత్తులు, రాజస్థాన్ ఎడారి వేడి శారీరక, మానసిక ఓర్పుకు పరీక్ష. ఇది రాజపుత్రుల వైభవం,పట్టుదలను మిళితం చేస్తుంది.

భీమ్‌గఢ్ ఫోర్ట్ , కర్ణాటక
బెలగావి సమీపంలోని భీమ్‌గడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో దాగి ఉన్న ఈ పచ్చికతో నిండిన కోట దట్టమైన అడవి, రహస్యాలతో కప్పబడి ఉంటుంది. ఈ ట్రైల్ గుర్తించబడలేదు. వర్షాకాలంలో జలగలు అధికంగా ఉంటాయి.అడవి జంతువులతో ఎదురుపడుతుంటాయి. సహజత్వం, కాలక్రమేణా మరుగున పడిన కోటలు నచ్చితే భీమ్‌గడ్ ట్రై చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

కనసర్ ఫోర్ట్, ఉత్తరాఖండ్
తక్కువగా తెలిసిన హిమాలయన్ రత్నం కనసర్, కోట ఎంత ముఖ్యమో, దాన్ని చేరుకునే ప్రయాణం కూడా అంతే ముఖ్యం. చక్రతా నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైల్ దట్టమైన దేవదార్ అడవులు, ఏటవాలు పర్వతాలు, పొగమంచుతో కప్పబడిన పచ్చిక బయళ్ళ గుండా వెళ్తుంది. ఈ ఎత్తైన ట్రెక్ పొడవుగా, అలసిపోయేదిగా ఉంటుంది అంతా నిశ్శబ్దం, ఆత్మను కదిలించే దృశ్యాలు, స్వచ్ఛమైన హిమాలయన్ వాతావరణం దీన్ని మరచిపోలేనిదిగా మారుస్తాయి.

కాంగ్రా ఫోర్ట్, హిమాచల్ ప్రదేశ్
మోటారు రోడ్డును వదిలి, కాంగ్రా కోటకు దాగి ఉన్న రిడ్జ్ ట్రైల్ ద్వారా వెళ్ళండి, ఇది రియల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ పురాతన మార్గం అటవీ కొండలు, రాతి గ్రామాలు, ఇరుకైన రిడ్జ్‌ల గుండా సాగుతుంది. ఇది ఏటవాలుగా, మారుమూలగా, ఊహించలేనిదిగా ఉంటుంది. ముఖ్యంగా హిమాచల్ వాతావరణం మారినప్పుడు అద్భుతంగా ఉంటుంది. కానీ భారతదేశంలోని పురాతన కోటలలో ఒకదానికి కాలినడకన చేరుకోవడం అసాధారణమైన అనుభూతినిస్తుంది.

లోహగడ్ టు విసాపూర్ ట్రావర్స్, మహారాష్ట్ర
ఈ రెండు కోటలు ప్రసిద్ధి చెందినప్పటికీ, లోహగడ్, విసాపూర్ మధ్య ఉన్న అటవీ ట్రావర్స్ మార్గం ఒక దాగి ఉన్న సవాలుగా మిగిలిపోయింది. ఈ ట్రైల్ ఏటవాలుగా తరచుగా పొదలతో నిండి ఉంటుంది. వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ మార్గాన్ని కనుగొనే నైపుణ్యాలు కీలకం, సహజసిద్ధమైన భూభాగం, రెండు కోటలను ఒకేసారి చూసే అరుదైన అవకాశం.

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!