Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్ఢా నుంచి కశ్మీర్కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది. బ్రిటిష్ కాలం నాటి ప్లాన్, శివాలిక్, పీర్ పంజాల్ పర్వతాలను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఇన్నాళ్లకు నిజమైంది. ఈ వంతెన విశేషాలు ఏంటి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? వివరంగా తెలుసుకుందాం.
భారతదేశానికి ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కల ఈరోజు నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కట్ఢా నుంచి కశ్మీర్కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది. ఎంతో కష్టమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్లాన్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. అలాగే, కట్ఢాలో రూ.46 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ఆవిష్కరించారు. కట్ఢా-శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో కట్టిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి) ను కూడా ప్రధాని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఉధంపుర్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయిన మోదీ.. వంతెన ప్రారంభానికి ముందు దానిని పరిశీలించారు. అలాగే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్ రైలులో మోదీ ప్రయాణించారు. ఆ తర్వాత మోదీ కట్ఢాలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు.

ఈ రైలు మార్గం ద్వారా కశ్మీర్ను భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేయడానికి చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఈ వంతెన ఒక భాగం. చినాబ్ నది లోపలి భాగం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
చాలా వేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను కూడా తట్టుకునేలా హై-టెక్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. దీని ప్రారంభంతో జమ్మూ నుంచి శ్రీనగర్కు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ వంతెన లైఫ్టైమ్ దాదాపు 120 ఏళ్లు అని ఇంజినీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కి.మీ. మేర విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం దాదాపు ₹1,486 కోట్లు ఖర్చు చేసింది. అలాగే 28 వేల టన్నుల స్టీల్ను వాడినట్లు తెలుస్తోంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయీ టైమ్లో ఈ ప్రాజెక్ట్కు ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయింది.
చినాబ్ వంతెన నిర్మాణం మన దేశ ఇంజినీరింగ్ సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, కశ్మీర్ లోయను దేశంతో కనెక్ట్ చేసే ఒక వారధి. దీనివల్ల రవాణా మెరుగుపడటమే కాకుండా, ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన దేశానికి ఇది ఒక గర్వకారణమైన ప్రాజెక్ట్.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.