శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
ముఖ్యాంశాలు
శక్తి పీఠాలు ఎలా ఏర్పాడ్డాయి ? | how shakti peethas formed
మహాశివుడి భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి (Daksha Prajapati) ఒకసారి యాగం చేస్తాడు. అయితే శివుడిపై కోపంతో అతను తన కూతురుని ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలివకున్నా అక్కడికి వెళ్తుంది సతీదేవి.
- ఇది కూడా చదవండి : 51 శక్తి పీఠాల పేర్లు ఏంటి ? అవి ఎక్కడ ఉన్నాయి ? పూర్తి సమాచారం
అది గమనించిన దక్షుడు పిలవకుండా వచ్చిన సతీదేవిని (Sati Devi) అవమానిస్తాడు. దాంతో అవమాన భారంతో సతీదేవి ఆగ్ని గుండంలో ప్రవేశం చేసి ప్రాణాలు ఆర్పిస్తుంది. తన అర్థాంగిని కోల్పోయిన బాధలో వేదనతో సతీ దేవి శరీరాన్ని చేతుల్లో తీసుకున్న శివుడు (Lord Shiva) ముల్లోకాలు కంపించేలా తాండవం చేస్తాడు.
పరిస్థితిని అదుపులోకి తేవడానికి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేస్తాడు శ్రీ మహా విష్ణువు (Lord Vishnu). అలా సతీదేవి శరీర అంగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలు. ఈ శక్తి మొత్తం 18, లేదా 52, లేదా 102 అని చెబుతుంటారు.
వైష్ణో దేవి ఆలయం , జమ్మూ కశ్మీర్ | 5 Shakti Peethas

Vaishno Devo Temple, Jammu and Kashmir : త్రికూట పర్వతంపై కొలువై ఉన్న వైష్ణోదేవి ఆలయం భారత్లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటి ( కొన్ని శక్తి పీఠాలు విదేశాల్లో కూడా ఉన్నాయి). అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు భక్తులు. ఇక్కడ అమ్మవారిని సరస్వతి, లక్ష్మీదేవి, కాళీకా దేవి శక్తులకు ఒక ప్రతిరూపంగా భావిస్తారు.
కామాక్షి అమ్మవారి ఆలయం, కాంచిపురం, తమిళనాడు

Kamakshi Amman Temple, Kanchipuram : మనం ప్రేమతో కంచి కామాక్షి అమ్మవారు అని పిలుచుకుంటాం. ఇక్కడ అమ్మవారని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అని అంటారు. ఈ ఆలయం ఎంత మహిమాన్వితమో…ఆలయ నిర్మాణ శైలి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.
చక్కగా చెక్కిన శిల్పాలు, మంటపాలతో ప్రాపంచిక విషయాలు మర్చిపోయేలా చేసేలా ఉంటుంది ఆలయ ప్రాంగణం. దేవి నవరాత్రులు (Navratri) సమయంలో ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం వస్తుంటారు.
మా చింతపూర్ణి ఆలయం, హిమాచల్ ప్రదేశ్

Maa Chintpurni Temple, Himachal Pradeh : ఎత్తైన కొండల్లో ఉండే మా చింత్పూర్ణి ఆలయం ఆనేది చింత్పూర్ణి అమ్మవారికి అంకితమైన దేవాలయం. చింత అంటే టెన్షన్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని భక్తితో పూజిస్తే మన చింతలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు.
జ్వాలా దేవి శక్తి పీఠం, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్

Jwalaji Shakti Peetha, Kangra, Himachal Pradesh: పర్వతం నుంచి ఉద్భవించిన అగ్నికి ప్రతిరూపంగా భావించే జ్వాలాజి దేవి ఆలయం అనేది ఇతర శక్తిపీఠాల కన్నా కాస్త భిన్నమైనది.
సతీదేవి నాలుక భాగం ఇక్కడ పడింది అని అంటారు. ఆధ్యాత్మిక శక్తి కావాలి అనుకునే భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తుంటారు.
కామాఖ్య అమ్మవారి ఆలయం, గౌహతి, అస్సాం

Kamakhya Temple, Guwhati, Assam : అమ్మవారి భక్తులు ఎక్కువగా సందర్శించే శక్తిపీఠాల్లో కామాఖ్య అమ్మవారి ఆలయం కూడా ఒకటి. కామాఖ్య అమ్మవారిని భక్తితో కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని సృజనాత్మక శక్తి పెరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. తంత్రపూజలు చేసే వారికి ఈ ఆలయం అత్యంత ప్రధానం అని కూడా భావిస్తారు.
ప్రయాణికుడు వీడియో చూడండి : కామాఖ్య అమ్మవారి కథ
శక్తి పీఠ దర్శనం ఎందుకు చేసుకోవాలి ? | Why Visit These Shakti Peethas?
- ఆధ్మాత్మిక చైతన్యం : శక్తి పీఠాలు అనేవి శక్తికి కేంద్రాలుగా భావిస్తారు. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు చాలా మంది భక్తులు వెళ్లుంటారు.
- సాంస్కృతిక వారసత్వం : ప్రతీ శక్తి పీఠానికి ఒక వినూత్నమైన నిర్మాణ శైలి, కథ, ప్రాధాన్యత, ఆచారాలు ఉంటాయి. భారతీయ సంస్కృతికి (Indian Heritage) శక్తి పీఠాలు ప్రతీకగా భావించవచ్చు.
- వ్యక్తిగత మార్పు : తీర్థయాత్రలకు (Pilgrimage) వెళ్లడం వల్ల చైతన్యం కలుగుతుంది. ఆధ్మాత్మికంగానే కాదు మరెన్నో అంశాల్లో మార్పునకు అవకాశం లభిస్తుంది అంటారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.