పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నాయి. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.
ముఖ్యాంశాలు
2019 తరువాత దారుణమైన ఘటన | Pahalgam Terror Attack
2025 ఏప్రిల్ 22 వ తేదీన పహల్గాంలోని బైసారన్ (Baisaran) గడ్డిమైదానంలో సేదదీరుతున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. 2019 లో పుల్వామాలో జరిగిన దాడి (Pulwama Attack) తరువాత జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఈ ఘటన దేశం మొత్తాన్ని షాక్కు గురి చేసింది. ప్రజల్లో ఆగ్రహం వెలువెత్తింది. అదే సమయంలో కాశ్మీరు పర్యాటక రంగం కుదేలయింది.
- ఈ దాడి జరిగిన తరువాత వీలైనంత త్వరగా జమ్మూ , కశ్మీరు నుంచి బయటపడాలని పర్యాటకులు కోరుకున్నారు. దీంతో శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఎన్నడూ లేనంత రద్దీ కనిపించింది.
87 టూరిస్ట్ స్పాట్లలో 44 మూసివేత | Kashmir Tourist Spots
పర్యాటకులు భద్రతను దృష్టిలో పెట్టుకుని జమ్మూ, కశ్మీర్ (Jammu and Kashmir) ప్రభుత్వం 87 పర్యాటక ప్రాంతాల్లో 44 స్పాట్లను మూసి వేసింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించే దిశలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఈ స్పాట్లను మూసి వేసి ఉండవచ్చు…లేదా జనావాసాలకు దూరంగా సెక్యూరిటీ లేని పర్యాటక ప్రదేశాలు అవ్వడం వల్ల కూడా వీటిని మూసివేసి ఉండవచ్చు.
- కారణం ఏదైనా యూస్ మార్గ్, టూసీ మైదాన్, దూద్ పత్రి, బాంగస్, వాట్లాబ్, అహర్బల్ వంటి ప్రాంతాలు అధికారుల నుంచి సూచనలు వచ్చే వరకు మూతబడి ఉంటాయి.
సెక్యూరిటీ పెంపు
ఇక టూరిస్టుల కోసం తెరచి ఉన్న పర్యాటక క్షేత్రాలలో పహల్గాం వంటి పాపులర్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. పహల్గాంలో ఉన్న టూరిస్ట్ స్పాట్లలో సెక్యూరిటీని భారీగా పెంచారు. పర్యాటకుల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చెక్ పాయింట్స్ను పెంచడంతో పాటు పాట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
యాంటి టెర్రర్ ఆఫరేషన్ | Anti Terror Operation
పహల్గాం ఉగ్రదాడుల తరువాత ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపై, వారి మద్దుతుదారుల నివాసాలపై అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 9 మంది అనుమానిత ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశారు.
- మరోవైపు ఆరు రోజుల్లో 600 ప్రాంతాల్లో రైడ్ చేసి వందలాదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.