కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.
ముఖ్యాంశాలు
ఆర్మీ బ్యాండ్లో ఊరేగింపు | Kedarnath Temple
కేదార్నాథ్లో మహాశివుడిని బాబా కేదార్ అని పిలుస్తుంటారు. ఉఖిమఠం (Ukhimath) ప్రాంతంలోని శ్రీ ఓంకారేశ్వర్ ఆలయం (Omkareshwar Temple) నుంచి కేదార్నాథ్ ఆలయం వరకు భోళా శంకరుడి విగ్రహాన్ని ఉత్సవంగా తీసుకెళ్లే యాత్ర పవిత్ర యాత్ర మొదలైంది.
చలికాలంలో విగ్రహాన్ని మఠంలోనే పూజలు-సేవలు నిర్వహిస్తారు. చలికాలం పూర్తయ్యాక ఆలయానికి తిరిగి తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాబా కేదార్ విగ్రహాన్ని పువ్వులతో అలంకరించిన పంచముఖి డోలిలో (panchmukhi doli) ఆలయ పుజారులు, వేదపండితులు, బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యులు మోసుకెళ్తూ తీసుకెళ్తారు.ఈ ఊరేగింపులో ఆర్మీ బ్యాండ్ వినిపించే భక్తిరస సంగీతం భక్తులలో ఉత్సాహాన్ని పెంచుతుంది.
డోలి యాత్ర విశేషాలు | Doli Yatra Kedarnath
బాబా కేదార్ (Baba Kedar) డోలీ యాత్ర గుప్త్ కాశీ (Gupt Kashi), ఫాటా, గౌరీ కుండ్ (Guarikund) నుంచి సాగుతూ 2025 మే 1న కేదార్నాథ్ చేరుకుంటుంది. ఇక మే 2వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకుంటాయి. ఛార్ ధామ్ యాత్రకు భయల్దేరిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఈ ఏడాది 60 లక్ష మంది భక్తులు బాబా కేదార్ను దర్శించుకునే అవకాశం ఉండటంతో మొదటి నెలలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలను వీలైనంత వరకు తగ్గించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీంతో ఆలయ సిబ్బందికి సాధారణ భక్తుల సేవలో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది.
- ఇది కూడా చదవండి : యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates
భక్తుల కోసం మార్గదర్శకాలు | Pilgrim Guidelines

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ వెళ్లే భక్తుల కోసం బద్రినాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటి (BKTC) తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు, మెడికల్ క్యాంపులు, సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఇక ఆలయానికి (Kedarnath Temple) వచ్చే భక్తులు ఆలయ పవిత్రతను కాపాడాలని…ఆలయ ప్రాంగణంలో కనీసం 30 మీటర్ల వరకు కూడా ఎవరూ రీల్స్ చేయడం చేయరాదని ఆలయ కమిటి విఙ్ఞప్తి చేసింది.
- ఇది కూడా చదవండి : కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025
మొత్తానికి
మహా శివుడి (Lord Shiva) విగ్రహం కేదార్ నాథ్ చేరుకోవడం అనేది తీర్థయాత్రలకు ప్రారంభోత్సవంగా భావించవచ్చు. ప్రతీ హిందువు (Hindu) జీవితంలో ఒక్కసారి అయినా ఛార్ ధామ్ యాత్రను చేయాలి అని కోరుకుంటాడు. అందుకే ఈ యాత్ర చేపట్దడానికి ముందే మానసికంగా, శారీరకంగా సిద్ధం అవుతారు భక్తులు.
మరి ఈ యాత్రను సురక్షితంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలి అనుకుంటే ఆలయ అధికారులు, కమిటీ జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
కేదార్నాథ్, ఛార్ ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్ర (amarnath yatra) , కైలాష్ మానసరోవర్ యాత్ర (kailsash Mansarovar yatra), ఆది కైలాష్ యాత్ర ..ఇలా తీర్థయాత్రల గురించి ప్రయాణికుడు డాట్ కామ్లో (prayanikudu.com) రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాము. ఇకపై చేస్తుంటాము కూడా.
మీ ప్రయాణంలో ఒక మార్గదర్శిగా, ఒక తోడుగా ఈ ప్రయాణికుడిని (telugu travel vlogger and blogger) భావించగలరని…రెగ్యులర్గా ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నాము.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.