అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
వసంత నవరాత్రులు

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను (Vijayawada Kanakadurgamma) దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాలు నుంచి వస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రస్తుతం వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం రోజున ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది.
- ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
పుష్పార్చన విశేషాలు | Kanaka Durgamma Pushparchana

ఇటీవలే నటరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన పూజా మండపంలో పసుపు, తెలుపు చామంతులు, మల్లెపూలతో ప్రత్యక పుష్పార్ఛన జరిగింది.

ముందుగా ప్రధాన ఆలయం నుంచి అర్చకులు, అధికారులు పుష్పాలు ఉన్న వెదురు బుట్టలను అర్చన జరిగే ప్రాంతానికి తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 9 గంటలకు అర్చన ప్రారంభమైంది. ఈ పుర్పార్చనకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు.
పుష్పార్చనలో విదేశీ భక్తులు | Japanese Women In Indrakeeladri

దుర్గమ్మవారి పుష్పార్చనలో ఈ సారి ఇద్దరు విదేశీ మహిళలు కూడా విచ్చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు (Tokyo) చెందిన ఈ మహిళలు అమ్మవారి పుష్పార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. విజయవాడలో పర్యటిస్తున్న తరుణంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా అమ్మవారి గురించి, అమ్మవారి మహిళమల గురించి తెలిసిందని మహిళలు తెలిపారు.

ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే విశేషమైన పూజల గురించి తెలుసుకుని ఆలయానికి చేరుకున్నామని, భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నామని తెలిపారు ఈ విదేశీ భక్తులు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.