India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ). కానీ పర్యాటకానికి అనుకూలమైనవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైన ప్రాంతాలలో, చూడముచ్చటైన ప్రదేశాలలో ఉన్నాయి. భారతదేశంలోని ఈ అరుదైన, దాగి ఉన్న దీవుల గురించి తెలుసుకుందాం.
వైపర్ ఐలాండ్ (Viper Island): అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ వైపర్ ఐలాండ్లో ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ రెండు దీవుల సమూహాలకు ఇది ప్రవేశ ద్వారంగా పని చేస్తుంది. ఇక్కడ 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వలస పాలనలో నిర్మించిన సెల్యులార్ జైలు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.
నార్త్ సెంటినెల్ ఐలాండ్ (North Sentinel Island): ఇది అండమాన్ దీవులలో ఒకటి. ఇక్కడ నివసించే సెంటినెలీస్ అనే ఆదిమ గిరిజనులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవిస్తారు. వీరు తమ దీవిని తీవ్రంగా రక్షించుకుంటారు. తమ వద్దకు వచ్చిన లేదా దీవిలో దిగిన బయటి వ్యక్తులను చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వారి గోప్యతను గౌరవిస్తూ ఈ దీవికి వెళ్ళడం నిషేధం విధించారు.
స్వరాజ్ ద్వీప్ (Swaraj Dweep): గతంలో హావ్ లాక్ ఐలాండ్ (Havelock Island) గా పిలువబడిన ఈ అండమాన్ దీవి ఒక ఎకో-టూరిజం హాట్స్పాట్. ఇక్కడ రాధానగర్ బీచ్, ఎలిఫెంట్ బీచ్, కాలపత్తర్ బీచ్ వంటివి ఈ ప్రాంతంలోని కొన్ని ఉత్తమ బీచ్లలో ఉన్నాయి. ఇవి తెల్లని ఇసుక, స్వచ్ఛమైన నీటితో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
లక్షద్వీప్ దీవులు (Lakshadweep Islands): లక్షద్వీప్ 36 దీవులతో కూడిన ఒక స్వర్గం లాంటి ద్వీపసమూహం. చిత్రంలో కనిపించే బంగారం అటోల్ (Bangaram Atoll) స్క్రూపైన్ (screwpine), కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఇవి సహజసిద్ధమైన అందం, అద్భుతమైన పగడపు దిబ్బలు, పర్యాటక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాయి.
మున్రో ఐలాండ్, కేరళ (Munroe Island, Kerala): కేరళ బ్యాక్వాటర్స్లో ఉన్న మున్రో ఐలాండ్, ఎనిమిది చిన్న దీవుల సమూహం. స్కాటిష్ నివాసి కల్నల్ జాన్ మున్రో పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కాలువల నెట్వర్క్ను రూపొందించడంలో ఆయన పాత్ర పోషించారు. ఇక్కడ బోటింగ్, కనోయింగ్ ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
సెయింట్ మేరీస్ దీవులు, కర్ణాటక (St. Mary’s Islands, Karnataka): కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సెయింట్ మేరీస్ దీవులు నాలుగు చిన్న దీవుల సమూహం. ఇవి వరుసగా అమర్చిన రాతి స్తంభాల (columnar rhyolitic lava) విశిష్టమైన భూగర్భ నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. ఇది ఈ ప్రదేశాన్ని జియో-టూరిజం మ్యాప్లో నిలిపింది.

రామేశ్వరం దీవి, తమిళనాడు (Rameswaram Island, Tamil Nadu): పాంబన్ దీవి (Pamban Island) అని కూడా పిలువబడే రామేశ్వరం దీవి. వాస్తవానికి 1914లో ప్రారంభమైన భారతదేశపు మొదటి సముద్ర వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానించబడింది. బీచ్లకు, ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఐకానిక్ దీవికి రైలు మార్గానికి బదులుగా కొత్త రోడ్డు వంతెన రాబోతోంది. ఇది హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి.
ఎలిఫెంటా ఐలాండ్, ముంబై (Elephanta Island, Mumbai): ముంబై నౌకాశ్రయంలో ఉన్న ఎలిఫెంటా ఐలాండ్లోని ప్రాచీన శిలల గుహలను యునెస్కో (UNESCO) 1987లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. శివుడికి అంకితం చేయబడిన గుహాలయాల సమూహాన్ని చూడటానికి పర్యాటకులు చాలా మంది ఈ దీవిని సందర్శిస్తారు.
ఇది కూడా చదవండి : Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు
దియు దీవి, గుజరాత్ (Diu Island, Gujarat): గుజరాత్లోని కథియావాడ్ ద్వీపకల్పం దక్షిణ తీరంలో ఉన్న దియు దీవి, గత పోర్చుగీస్ కాలంనాటి అవశేషాలతో నిండి ఉంటుంది. 16వ శతాబ్దపు దియు కోట దీనికి ఒక ఉదాహరణ. ఇది ప్రపంచంలోని పోర్చుగీస్ మూలానికి చెందిన ఏడు అద్భుతాలలో ఒకటిగా నిలుస్తుంది.
దివార్ ఐలాండ్, గోవా (Divar Island, Goa): గోవాలోని దివార్ ఐలాండ్ కూడా చారిత్రక ఇండో-పోర్చుగీస్ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు.. పియేడాడ్ (Piedade) అనే గ్రామంలో 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ కంపాషన్ (Church of Our Lady of Compassion) ఉంది. “పియేడాడ్” అంటే పోర్చుగీస్లో “జాలి” లేదా “కరుణ” అని అర్థం.
ఈ దీవులు భారతదేశం అద్భుతమైన భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతీ దీవికి దానికదే ఒక ప్రత్యేక చరిత్రను, అందాలను కలిగి ఉన్నాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.