కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించారు.
ముఖ్యాంశాలు
మాక్ డ్రిల్ లక్ష్యం | Tirumala Security Forces

తిరుమలేశుడిని (Lord Venkateshwara) దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సురక్షితంగా ఉంచేందుకు తిరుమల సెక్యూరిటీ ఫోర్స్ ఏ మేరకు సిద్ధంగా ఉందో ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించారు. ఒకవైపు ఉగ్రవాదులపై కాల్పులు చేస్తూ మరోవైపు భక్తులను రక్షిస్తూ సాగిన ఈ మాక్ డ్రిల్ లేపాక్షి సర్కిల్ (Lepakshi Circle) వద్ద అడిషన్ ఎస్పీ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.

- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఈ మాక్ డ్రిల్లో భాగంగా అసాల్ట్ డాగ్ ఆఫరేషన్స్, ఎనిమీ ఎటాక్ రెస్పాన్స్, రూమ్ ఇంటర్వెన్షన్ టెక్నిక్స్ను ప్రాక్టికల్గా చేసి చూపించారు. సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం, వారి సమర్థతను రియల్టైమ్లో ఇలా చెక్ చేశారు.

మాక్ డ్రిల్ ఎందుకంటే | Octopus Mock Drill In Tirumala
ఈ మాక్ డ్రిల్లో మొత్తం 28 మంది ఆక్టోపస్ కమాండోస్ (Octopus Force), 25 మంది టిటిడి విజిలెంట్ సిబ్బంది, 15 మంది పోలిస్ అధికారులు,10 మంది ఏపీ పోలీసు (AP Police) సిబ్బంది పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ అనేది తిరుమల (Tirumala) సెక్యూరిటీ సిబ్బంది సంసిద్ధతను చెక్ చేసేందుకు ఒక మంచి వికల్పంగా భావించవచ్చు.

రోజురోజుకు పెరుగుతున్న దాడుల ముప్పును తట్టుకుని సరైన టైమ్లో ప్రతిదాడులు నిర్వహించి భక్తులను రక్షించే విధంగా ఈ డ్రిల్స్ నిర్వహించారు. సిబ్బంది పని తీరు, సమన్వయం, రెస్పాన్స్ టైమ్ వంటి విషయాలను నోట్ చేసుకుని పనితీరును మెరుగు పరిచే అవకాశం ఉంటే మెరుగుపరుస్తారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.