ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…
ముఖ్యాంశాలు
144 ఏళ్ల తరువాత .. | Maha Kumbh Mela 2025 Importance
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం అయిన మహా కుంభ మేళా ( Maha Kumbha Mela 2025 ) జరుగుతున్న విషయం తెలిసిందే. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనానికి దూరదూరం నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు నాగసాధువులు.
వీరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్లారో కూడా తెలియదు అని చాలా మంది అంటారు. అంత రహస్యంగా ఉంటుంది అంటారు వీరి జీవనశైలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కని;పిస్తారు. వీరికి అండగా అక్కడి స్థానికులు బౌలింగ్ చేయడం, ఫీల్డింగ్ చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు.
నాగసాధువులకు క్రికెట్ వస్తుందా అసలు అని చాలా మందికి సందేహం రావచ్చు. మిగితా వారి విషయం తెలియదు కానీ వీడియోలో ఉన్న నాగ సాధువు మాత్రం పెద్ద పెద్ద షాట్స్ కొడుతూ ఫీల్డర్ల కాళ్లకు పని పెడుతున్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ల లాగే ఉంది వీరి బ్యాటింగ్ అని చెప్పట్లేదు.. కానీ క్రీజ్ లైన్ దాటి బ్యాట్ ఎత్తి మరీ బాలును బాదేస్తున్నారు ఈ నాగ సాధువు. కొన్ని బాల్స్ మిస్ కూడా అవుతున్నాయి. మే బీ అంత రెగ్యులర్గా ప్రాక్టిస్ లేదేమో.
నాగసాధువులు (Naga Sadhus) బ్యాటింగ్ను ఎంజాయ్ చేస్తూ కొంత మంది కనిపించగా మరికొంత మంది వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు. బండరాళ్ల వికెట్ల వెనక మరో నాగసాధువు కీపింగ్ చేయడం కూడా మీరు చూడవచ్చు. మొత్తానికి ఈ ఆటను అటు నాగసాధువులు, అక్కడ ఉన్న స్థానికులు ఇటు నెటిజెన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
నెటిజన్ల రియాక్షన్ | Naga Sadhus Video
ఈ వీడియోను జేపీసిన్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి బాబా వర్సెస్ ప్రయాగ్రాజ్ ( Prayagraj ) అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేశారు.
महाकुंभ में बाबा लोग फुर्सत में क्रिकेट खेलते हुए pic.twitter.com/MCHKHFn0h9
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) February 5, 2025
- అభయ్ తివారి అనే యూజర్ “మహాకుంబ్ నాగా లీగ్ జరుగుతోంది” అని కామెంట్ చేశాడు
- “ఇంతకన్నా అందమైన సీన్ ఏముంటంది చెప్పండి” అని బబ్లూ జైన్ అనే యూజర్ కామెంట్ చేశాడు
ఆధ్మాత్మిక సమ్మేళనం | Maha Kumbh Mela 2025 Overview
ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కడితో అని తెలియదు కానీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ప్రాంతానిదే అని తెలుస్తోంది. 2025 జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. ఈ కుంభమేళాలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ( Triveni Sangam ) పవిత్ర నదీ స్నానం ఆచరించేందుకు సుమారు 45 కోట్ల మంది భక్తులు 150 దేశాల నుంచి వస్తారని అధికారులు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర నదీ స్నానాన్ని ఆచరించారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.