Hemkunt Express : తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ముఖ్యాంశాలు
ఏం జరిగింది? | Hemkunt Express
2025 మే 7 వ తేదీని హేంకుట్ ఎక్స్ప్రెస్లోని థర్డ్ ఏసిలో ప్రయాణిస్తున్న వ్యక్తి వాటర్ బాటిల్ను ఎక్కువ ధరకు తనకు అమ్మారని ఫిర్యాదు చేశాడు. కొన్ని గంటల తరువాత పాంట్రీ సిబ్బంది అతడి వద్దకు వచ్చి దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట, లోకోపైలెట్ ఏం చేశాడంటే..
ఈ వీడియోలో ప్రయాణికుడు తన సీటపై ఉండగానే పాంట్రీకి చెందిన కొంత మంది ప్రయాణికులు వచ్చి అతడిని కిందికి దిగమన్నారు. తను ఎందుకు దిగాలని ప్రయాణికుడు ప్రశ్నించగా అతడిని బలవంతంగా దింపేందుకు ప్రయత్నించారు.
అయినా దిగపోయే సరికి పాంట్రీ (Railway Pantry) సిబ్బంది ఒకరు పైన ఉన్న బెర్త్పైకి ఎక్కి వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో సదరు ప్రయాణికుడికి గాయలవ్వడంతో పాటు అతడి బట్టలు కూడా చినిగిపోయాయి.
Outrageous! A passenger filed an online complaint about being overcharged by catering staff on 14609, Hemkunt express. Just hours later, he was brutally beaten by the pantry staff, simply for daring to raise a complaint!
— THE SKIN DOCTOR (@theskindoctor13) May 7, 2025
Today's incident. pic.twitter.com/j6f0HAksN7
పరిష్కారం లభిస్తుందనుకున్నాడు..
వాండార్ అక్వా అనే నీటి బాటిల్ను కొన్న విశాల్ అనే ప్రయాణికుడు దానికి రూ.20 చెల్లించాడు. ఇది ఎమ్మార్పికన్నా ఎక్కువ అని గమనించి రైల్ మదద్ యాప్ (Railmadad App)లో ద్వారా ఫిర్యాదు చేశాడు. వెంటనే రైల్వే అధికారుల నుంచి కాల్ వచ్చింది. దీంతో దీనికి పరిష్కారం లభిస్తుంది అనుకున్నాడు విశాల్. కానీ ప్యాంటీ సిబ్బంది వచ్చి దాడి చేయడం గమనార్హం.
- ఇది కూడా చదవండి : Cautionary Tale : భారత్లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్
స్పందించిన రైల్వే | Railways’ Response
పాంట్రి సిబ్బంది దాడి చేసిన వీడియో వైరల్ అవడం ప్రజల ఆగ్రహాన్ని గమనించిన భారతీ రైల్వే (Indian Railway) ఎక్స్లో స్పందించింది. ఈ విషయాన్ని తాము సీరియస్గా తీసుకున్నాం అని సదరు క్యాటరర్పై కేసు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల పెనాల్టిని కూడా విధించినట్టు తెలిపారు. దర్యాప్తు అనంతరం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది రైల్వే శాఖ.
The case is being taken with utmost seriousness. A penalty of ₹5 lakh has been imposed on the caterer. An FIR has been lodged by GRP, Kathua. The matter remains under strict watch. Stern action will follow based on the investigation outcome. pic.twitter.com/juwS1eSzTR
— Ministry of Railways (@RailMinIndia) May 8, 2025
Cover Photo Source: mr vishal/youtube
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.