ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది ( Mumbai Hyderabad Bullet Train ) . దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ కారిడార్లో హైదరాబాద్ వరకు రానుంది ( Mumbai Hyderabad Bullet Train ). కొన్ని రోజుల ముందు వరకు కూడా బుల్లెట్ కారిడార్ కేవలం ముంబై , అహ్మదాబాద్ మధ్యలో ఉంటుంది చాలా మంది అనుకున్నారు.
దీనిని చెన్నై, బెంగుళూరుకు కూడా విస్తరించనున్నారు అని తెలిసింది. తాజాగా ఈ కారిడార్ను హైదరాబాద్ వరకు కొనసాగించనున్నట్టు సమాచారం. ఈ కొత్త ప్రపోజల్లో భాగంగా ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది. దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ముఖ్యాంశాలు
ప్రాజెక్టు వివరాలు | Mumbai Hyderabad Bullet Train Project Overview
జాతీయ రైల్ ప్లాన్ ( National Rail Plan ) లో భాగంగా ఈ హైస్పీడ్ రైల్ ( High Speed Rail ) నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం ఈ ప్లాన్లో భాగంగా 7 అత్యంత సమర్థవంతమైన మార్గాల్లో ముంబై హైదరాబాద్ కారిడార్ కూడా ఒకటి. ఈ రెండు పెద్ద నగరాాల మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టును అమలులోకి తీసుకురానున్నారు..
ప్రాజెక్టు గడువు | Timeline and Feasibility
ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి 2051 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన పనులు జరుగుతుండగా ఈ మార్గంలో మట్టి పరీక్ష, భూసేకరణ, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను పరగణలోకి తీసుకోనున్నారు. దీని తరువాత వచ్చే వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టును బట్టి తరువాత నిర్ణయాలు తీసుకోనున్నారు.
A Shinkansen operating at 370 kmph with 5 intermediate stops would take approximately 4 hours and 30 minutes to travel between Delhi and Mumbai, including Accel/Decel & Dwell Time.
— Bhaumik Gowande (@bhaumikgowande) January 28, 2025
This can be our reality 🚅pic.twitter.com/2xmYBveua8
లాభాలు | Benefits Of Bullet Train Corridor

- ప్రయాణ సమయం తగ్గుతుంది : బుల్లెట్ ట్రైన్ ప్రధాన లక్షణం వేగం. దీని ప్రధాన లక్ష్యం సమయం తగ్గించడం. కొన్ని గంటల్లోనే రెండు ప్రాంతాల మధ్య ప్రజలను కనెక్ట్ చేస్తుంది.
- ఆర్థికాభివృద్ధి : రెండు మార్గాల్లో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం వల్ల ఆర్థికంగా ఇరు నగరాలకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య వ్యాపారం, టూరిజానికి లాభం కలగనుంది.
- పర్యావరణ ప్రభావం : మిగితా ట్రైన్లతో పోల్చితే బుల్లెట్ ట్రైన్ అనేది పర్యావరణానికి తక్కువ హానికలిగిస్తుంది అని చెప్పవచ్చు. విమానం, రోడ్డు మార్గాన వెళ్లే వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం కన్నా ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
- ఉద్యోగ కల్పన : ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం వల్ల స్థానికులతో పాటు వివిధ రంగాల వారికి ఉద్యోగం లభించనుంది.
ప్రస్తుతం భారత ప్రభుత్వం ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుపై ( Mumbai Ahmedabad High-Speed Rail project ) ఫోకస్ పెడుతోంది. ఈ ప్రాజెక్టు 2026 వరకు అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు. కానీ ఇది 2033 వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ సమయం వరకు ఈ మార్గంలో వందే భారత్ ట్రైన్ నడవనుంది అని సమాచారం. ఈ బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ సాయం తీసుకోనుంది భారత ప్రభుత్వం.
జపనీస్ బుల్లెట్ ట్రైన్ విశేషాలు | Japanese Shinkansen Bullet Train
భారత్లో బుల్లెట్ ట్రైన్ అనేది జపాన్ సాంకేతికత సాయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. జపాన్లో బుల్లెట్ ట్రైన్ను షింకాన్సేన్ ( Shinkansen Trains ) అని కూడా అంటారు. ప్రత్యేకంగా వీటి కోసం ట్రాక్స్ ఏర్పాటు చేయగా ఇవి గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తాయి.
ప్రపంచంలో తొలి బుల్లెట్ ట్రైన్ను ( First Bullet Train In World ) జపాన్ 1964లోనే నడిపింది. ప్రస్తుతం కొత్త వర్షన్ ట్రైన్ కోసం సాంకేతికతక డెవెలెప్ చేస్తున్నారు. సో మనకు లేటెస్ట్ వర్షన్ బుల్లెట్ ట్రైన్లు జపాన్తో పాటే అందుబాటులో రానున్నాయి.
ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.