హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ …ఏ సంవత్సరం అంటే | Mumbai Hyderabad Bullet Train

షేర్ చేయండి

ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది ( Mumbai Hyderabad Bullet Train ) . దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌‌లో హైదరాబాద్‌ వరకు రానుంది ( Mumbai Hyderabad Bullet Train ). కొన్ని రోజుల ముందు వరకు కూడా బుల్లెట్ కారిడార్ కేవలం ముంబై , అహ్మదాబాద్ మధ్యలో ఉంటుంది చాలా మంది అనుకున్నారు.

దీనిని చెన్నై, బెంగుళూరుకు కూడా విస్తరించనున్నారు అని తెలిసింది. తాజాగా ఈ కారిడార్‌‌ను హైదరాబాద్‌ వరకు కొనసాగించనున్నట్టు సమాచారం. ఈ కొత్త ప్రపోజల్‌లో భాగంగా ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది. దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 

ప్రాజెక్టు వివరాలు | Mumbai Hyderabad Bullet Train Project Overview

జాతీయ రైల్ ప్లాన్ ( National Rail Plan ) లో భాగంగా ఈ హైస్పీడ్ రైల్ ( High Speed Rail ) నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం ఈ ప్లాన్‌లో భాగంగా 7 అత్యంత సమర్థవంతమైన మార్గాల్లో ముంబై హైదరాబాద్ కారిడార్ కూడా ఒకటి. ఈ రెండు పెద్ద నగరాాల మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ  బులెట్ ట్రైన్ ప్రాజెక్టును అమలులోకి తీసుకురానున్నారు..

ప్రాజెక్టు గడువు | Timeline and Feasibility

ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి 2051 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన పనులు జరుగుతుండగా ఈ మార్గంలో మట్టి పరీక్ష, భూసేకరణ, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను పరగణలోకి తీసుకోనున్నారు. దీని తరువాత వచ్చే వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టును బట్టి తరువాత నిర్ణయాలు తీసుకోనున్నారు.

లాభాలు | Benefits Of Bullet Train Corridor

Mumbai Hyderabad Bullet Train
| ప్రతీకాత్మక చిత్రం
  1. ప్రయాణ సమయం తగ్గుతుంది : బుల్లెట్ ట్రైన్ ప్రధాన లక్షణం వేగం. దీని ప్రధాన లక్ష్యం సమయం తగ్గించడం. కొన్ని గంటల్లోనే రెండు ప్రాంతాల మధ్య ప్రజలను కనెక్ట్ చేస్తుంది.
  2. ఆర్థికాభివృద్ధి : రెండు మార్గాల్లో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం వల్ల ఆర్థికంగా ఇరు నగరాలకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య వ్యాపారం, టూరిజానికి లాభం కలగనుంది.
  3. పర్యావరణ ప్రభావం : మిగితా ట్రైన్లతో పోల్చితే బుల్లెట్ ట్రైన్ అనేది పర్యావరణానికి తక్కువ హానికలిగిస్తుంది అని చెప్పవచ్చు. విమానం, రోడ్డు మార్గాన వెళ్లే వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం కన్నా ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది. 
  4. ఉద్యోగ కల్పన : ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం వల్ల స్థానికులతో పాటు వివిధ రంగాల వారికి ఉద్యోగం లభించనుంది. 

ప్రస్తుతం భారత ప్రభుత్వం ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుపై ( Mumbai Ahmedabad High-Speed Rail project ) ఫోకస్ పెడుతోంది. ఈ ప్రాజెక్టు 2026 వరకు అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు. కానీ ఇది 2033 వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ సమయం వరకు ఈ మార్గంలో వందే భారత్ ట్రైన్ నడవనుంది అని సమాచారం. ఈ బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ సాయం తీసుకోనుంది భారత ప్రభుత్వం.

జపనీస్ బుల్లెట్ ట్రైన్ విశేషాలు | Japanese Shinkansen Bullet Train

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ అనేది జపాన్ సాంకేతికత సాయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. జపాన్‌లో బుల్లెట్ ట్రైన్‌ను షింకాన్‌సేన్ ( Shinkansen Trains )  అని కూడా అంటారు. ప్రత్యేకంగా వీటి కోసం ట్రాక్స్ ఏర్పాటు చేయగా ఇవి గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తాయి.

ప్రపంచంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ను ( First Bullet Train In World ) జపాన్ 1964లోనే నడిపింది. ప్రస్తుతం కొత్త వర్షన్ ట్రైన్ కోసం సాంకేతికతక డెవెలెప్ చేస్తున్నారు. సో మనకు లేటెస్ట్ వర్షన్ బుల్లెట్ ట్రైన్లు జపాన్‌తో పాటే అందుబాటులో రానున్నాయి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!