Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?

షేర్ చేయండి

మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ( Spiritual Tourism ) ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?

ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు గోవా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్ వరకు భక్తులకు ఉచిత రైలు ప్రయాణ  సౌకర్యాన్ని అందించనుంది. ఈ కార్యక్రమాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ( Pramod Sawant) ఇటీవలే ప్రారంభించారు. 

Free train Travel To Prayagraj From Goa Flagged off by CM Pramod Sawant
| గోవా- ప్రయాగ్‌రాజ్ ఉచిత తీర్థ యాత్ర ట్రైనును ప్రారంభిస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ( Image Credit : X/BJPGoa )

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం అయిన కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2055 ) వెళ్లే ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలా ఈ ప్రయాణం ఉంటుంది అని ప్రమోద్ సావంత్ తెలిపారు.ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు.

1.ప్రత్యేక ట్రైను | Goa – Prayagraj Free Train

గోవా నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు వెళ్లే ఈ ట్రైను 1,000 మంది భక్తులతో 2025 ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైంది. ఈ ఉచిత రైలు ప్రయాణం 34 గంటల పాటు సాగుతుంది. ఇందులో ప్రయాణికులు అరుదైన మహాకుంభ మేళాలో పవిత్ర నదీస్నానం ఆచరించేందుకు బయల్దేరారు.

2.డెడికేటెడ్ సర్వీస్ 

ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యోజనా అనే ( Mukhyamantri Dev Darshan Yojana ) కార్యక్రమంలో భాగంగా గోవా ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది గోవా ప్రభుత్వం. ఇది 2025 ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 21 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా తీర్థయాత్రలను ప్రోత్సాహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

3.ప్రయాణ అర్హత | Travel Eligibility

గోవా ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత రైలు ప్రయాణంలో భాగం అవ్వాలి అనుకుంటున్న భక్తుల వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. వారి ఆరోగ్యం బాగుండాలి. తీర్థయాత్రను ఆస్వాదించి, నదీస్నానం ఆచరించేందుకు చురుకుగా ఉండే ఈ ఏజ్ వాళ్లను ఎంచుకున్నారు. దీంతో పాటు యువతను ఎక్కువ సంఖ్యలో ఈ యాత్రలో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Maha Kumbh Mela Prayanikudu Special Stories
| కుంభమేళాకు సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4.కాంప్లిమెంటరీ మీల్స్ | Complimentary Meals 

ఈ కార్యక్రమంలో భక్తులకు ఉచిత రైలు ప్రయాణం ( Free Train Travel ) మాత్రమే కాదు వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రయాణికులకు ఉచిత ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తారు. దీని వల్ల ఈ జర్నీలో ఆహారం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు.

5.తగిన జాగ్రత్తలు

ఈ ప్రయాణంలో యాత్రికుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దీని కోసం ఆరోగ్య నిపుణుల సాయం తీసుకుంది. ఈ ప్రయాణంలో ఈ నిపుణులు కూడా ఉంటారు. ప్రయాగ్‌రాజ్ (prayagraj ) వెళ్లే భక్తులు పూర్తి ఆరోగ్యంతో అక్కడికి చేరుకుని తీర్థయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు.

మొత్తానికి గోవా (Goa) ప్రారంభించిన ఈ ఉచిత ట్రైను సర్వీస్ అనేది అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి సర్వీసులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాలని భక్తులు కోరుకుంటున్నారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!