Prayagraj Traffic: మహా కుంభమేళాలో 300 కిమీ మహా ట్రాఫిక్ జామ్

షేర్ చేయండి

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట ( Prayagraj Traffic). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) మొదలై దాదాపు నెల అవుతోంది. ఇంకా 16 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని భావిస్తున్న భక్తులు ప్రయాగ్‌రాజ్‌వైపు భారీ సంఖ్యలో బయల్దేరుతున్నారు. అయితే ఇలా భక్తులు ఓకేసారి బయల్దేరడంతో కుంభ మేళా దారులు అన్నీ కూడా వాహనాలతో నిండిపోయాయి. 

Prayanikudu
📣| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా సమాచారం ప్రకారం ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట (Prayagraj Traffic Jam). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

ఊహించలేదు | Prayagraj Maha Traffic Jam

జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభ మేళా ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు వరకు ( Last Day Of Maha Kumbh Mela 2025 ) కొనసాగనుంది. నిజానికి వసంత పంచమి తరువాత భక్తుల సంఖ్య తగ్గుతుంది అని భావించారట అధికారులు. కానీ రివర్స్‌లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. మరికొన్ని రోజులు మాత్రమే మహాకుంభమేళాకు సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా ఉంది అనిపిస్తోంది.

ప్రజలను ముందే ఆపుతున్న పోలిసులు

భారీ ట్రాఫిక్‌జామ్‌ను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితి మరింత దారుణంగా మారకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్య ప్రదేశ్‌లోని ( Madhya Pradesh) కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తుల వాహనాలను ఆపేస్తున్నారు. వారికి పరిస్థితి ఏంటో వివరిస్తున్నారు. 

దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఒక పోలిస్ అధికారి ప్రజలను ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

“ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ప్రయాగ్‌రాజ్‌ వెళ్లాలని బయల్దేరాదో వారు మరోకసారి తమ నిర్ణయంపై ఆలోచన చేయండి. ముందు వెళ్లే కొద్ది చాలా ట్రాఫిక్ ఉంది. అందుకే మీకోసం ఇక్కడ మేము ఒకసారి విషయం చెప్పడానికి వచ్చాం. మీ మనసును మార్చుకోండి. ఇంటికి తిరిగి వెళ్లడం గురించి ఆలోచించండి. ముందు కట్నీ అనే ప్రాంతం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మా పై అధికారి అక్కడ ఉన్నారు. ఆయన నాకు మీతో ఈ విషయం చెప్పమన్నారు చేతులు జోడిండి మరీ రిక్వెస్ట్ చేయమన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోండి. రహాదార్లు మొత్తం నిండిపోయాయి. కట్నీ నుంచి ప్రయాగ్‌రాజ్ 300 కన్నా ఎక్కువ దూరంలో ఉంది. అలాంటిది మిమ్మల్ని ఇక్కడ ఆపి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. చూడండి ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లడం అసాధ్యం ” అని మైకులో ప్రకటన చేశాడు.

ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకునే భక్తులు తను చెప్పిన విషయాన్ని ఆలోచించి ఇంటికి వెళ్లిపోవాలని కోరాడు సదరు పోలిసు అధికారి. దీంతో పాటు ఇక్కడి నుంచి మీకు యూ టర్న్ తీసుకుని వెళ్లిపోయే అవకాశం కూడా కల్పిస్తున్నాము. ముందుకు వెళ్లే కొద్ది మీకు అదికూడా దొరక్కపోవచ్చు అన్నారు.  దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉందో అని.

కారణాలు | Why Prayagraj Traffic Jam Happened

వీకెండ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలా మంది భక్తుల రావడం వల్లే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు పోలిస్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే పరిస్థితి సాధారణం అవుతంది అంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని అధికారుల సూచనల మేరకు స్థానిక జిల్లా పోలీసులు వాహనాలను ఆపడం పంపడం చేస్తున్నారు.

48 గంటలుగా ట్రాఫిక్‌లోనే….| Prayagraj Traffic

ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని బయల్దేరిన భక్తుల్లో చాలా మంది గత 48 గంటల నుంచి వాహనాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. 50 కిమీ ప్రయాణించడానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోందట.

ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ మూసివేత | Prayagraj Railway Station Closed

రద్దీ నిర్వహణ కోసం ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. ఈ విషయంపై మాట్లాడిన రైల్వే అధికారి కుల్దీప్ తివారి….ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్‌ను మూసివేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్ నడుస్తోంది. 

అఖిలేష్ యాదవ్ ట్వీట్

మహా ట్రాఫిక్ జరిగిన వేళ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. టోల్ గేట్ వద్ద భక్తుల వాహనాలను ఆపరాదు. టోల్ ఫీజు తీసుకోరాదు అంటూ ట్రాఫిక్ జామ్ వీడియోనను పోస్టు చేశాడు అఖిలేష్ యాదవ్.

గత 24 గంటల్లో ఏకంగా 46 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సమారు 44 కోట్ల మంది భక్తులు మహా కుంభ మేళాలో నదీ స్నానం ఆచరించినట్టు సమాచారం.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!