భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
ముఖ్యాంశాలు

ఈ శిక్షణా సంస్థలో విద్యార్థులను భారతీయ సంస్కృతి , వారసత్వానికి (Indian Heritage and Culture) దిశా నిర్దేశకులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూ విజయం సాధిస్తోంది. సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ, వాస్తు శిల్పం, ఇతర సంబంధిత కళా రూపాలపై శిక్షణ అందిస్తుంది. 1960 లో స్థాపించిన ఈ శిక్షణా సంస్థలో శిల్పశాస్త్రాల ప్రకారం ట్రైనింగ్ (Principles Of Architecture) ఇస్తున్నారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ కోర్సులు
డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ కోర్సు | Diploma in Traditional Sculpture Course
శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థ అనేది రాష్ట్ర సాంకేతికత విద్య, శిక్షణ, ఏఐసీటిఈ నుంచి అనుమతి పొందిన సంస్థ. ఆరు విభాగాల ఈ కోర్సు కాలపరిమితి వచ్చేసి 4 సంవత్సరాలు. ఆ విభాగాలు వచ్చేసి.

- ఆలయ నిర్మాణం
- శిలా శిల్ప విభాగం
- సుధా శిల్ప విభాగం
- లోహ శిల్ప విభాగం
- కొయ్య శిల్ప విభాగం
- సంప్రదాయ వర్ణ చిత్రలేఖన విభాగాలు ఉంటాయి.
ఈ కోర్సులో భాగంగా ప్రతీ ఏడాది ఒక్కో డిపార్ట్మెంట్లో పది మందికి మాత్రమే శిక్షణ ఇస్తారు. ఆ లెక్కన చూస్తే ప్రతీ ఏడాది 60 మంది విద్యార్థులకే అవకాశం లభిస్తుంది.
అర్హత : ఈ డిప్లమా కోర్సును అభ్యసించాలి అనుకునే విద్యార్థులు కనీసం పదవ తరగతి పాసై ఉండాలి.
సదుపాయాలు : విద్యార్థులకు ఉచితంగా వనతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
ఆలయ దర్శనం : ఇక ఈ కోర్సులో నాలుగవ తరగతికి చేరుకున్న విద్యార్థులకు దక్షిణాదిలోని ప్రముఖ ఆలయాల (Temples in South India) సందర్శనలో భాగంగా ప్రముఖ ఆలయాల తీసుకెళ్లి నిర్మాణ శైలిని గమనించే అవకాశం కల్పిస్తారు.
- ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
సంప్రదాయ కలంకారి కళ ( సర్టిఫికెట్ కోర్సు) | Traditional Kalamkari Art (Certificate Course)

ఇందులో వస్త్రాలపై కలంకారి కళ చిత్రరచనపై రెండు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు అందిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. ప్రతీ ఏడాది 10 మందికి అవకాశం ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా అందిస్తారు.
అర్హత పరిక్ష, ప్రవేశం | Entrance
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసి అనుగుణంగా ప్రతీ సంవత్సరం మే, జూన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 2025-26 సంవత్సరానికి గాను మే 5వ తేదీ నుంచి జూన్ 20 వరకు అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
డిప్లామా, సర్టిఫికెట్ కోర్సులో చేరిన విద్యార్థుల పేరిట టిటిడి (Tirumala Tirupati Devasthanams) ఒక జాతీయ బ్యాంకులో రూ.1 లక్షను డిపాజిట్ చేస్తుంది. కోర్సు పూర్తి అయ్యాక వారు ఎంచుకున్న కళలో సెటిల్ అవ్వడానికి వారికి వడ్డితో సహా మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు.
ఇక ఈ శిక్షణ సంస్థలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తితితే రినోవేషన్ విభాగంగా స్థపతులుగా, టీచర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లుగా అవకాశాలు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రభుత్వ శాఖలైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టూరిజం (Tourism), ఆర్కియాలజీ విభాగాల్లో కూడా అవకాశాలు లభించగలవు.

మరిన్ని వివరాల కోసం
- శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానములు, అలిపిరి రోడ్, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517507.
- మీరు వెబ్సైట్ కూడా విజిట్ చేయవచ్చు : https://ttdevasthanams.ap.gov.in/
- సంప్రదించాల్సిన నెంబర్ : 0877 – 2264637
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.