నేపాల్ వెళ్లేందుకు SpiceJet , Air India Express విమానాలకి అనుమతి 

షేర్ చేయండి

భారత్ నేపాల్ మధ్య వైమానిక సేవల్లో మరో కీలక అడుగు ముందుకు పడింది.  ఖాట్మాండులోని త్రిభువణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) నుంచి భారత్‌కు డైరక్ట్ ఫ్లైట్స్ నడిపేందుకు స్పైస్‌జెట్ (Spicejet), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు అనుమతి లభించింది.

దీంతో నేపాల్లో భారత వైమానిక సేవలు మరింతగా విస్తరించడంతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్య రంగానికి ఊతం లభించనుంది. 

విమాన సర్వీసుల విస్తరణ | SpiceJet

కోవిడ్ సంక్షోభానికి ముందుక నేపాల్‌కు డైరక్ట్ విమానలను నడిపేది స్పైస్‌జెట్. కానీ ప్యాండమిక్ వల్ల సేవలు నిలిచిపోయాయి. త్వరలో ఢిల్లీ నుంచి ఖాట్మాండు మధ్య విమానాలు మొదలవ్వనున్నాయి. మరో వైపు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు (Air India Express ) రోజుకు రెండు విమానాలు నడిపేందుకు అనుమతి లభించింది.

ఆ సమస్యకు పరిష్కారం…

Nepal Hindu Country
నేపాల్

ఖాట్మాండులోని త్రిభువణ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవలే రినోవేషన్ ( Nepal) పనులు పూర్తి చేసుకుంది. గతంలో ట్యాక్సీ వే వల్ల విమానాలు కూడా రద్దు అయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో ఇక విమాన సర్వీసులు సస్పెండ్ అయ్యే అవకాశం తగ్గింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విమానాశ్రయం రోజుకు 18 గంటలు పని చేయడం మొదలు పెట్టింది. 

కొత్తగా వచ్చిన ఈ సర్వీసుల వల్ల ఇరు దేశాల మధ్య ఆర్థిక, పర్యాటకపరమైన బంధం మరింతగా బలోపడనుంది. గతంతో పోల్చితే ఎక్కువ గంటలు ప్రయాణికులకు ఖాట్మాండు విమానాశ్రయం (Khantmandu Airport) అందుబాటు ఉండనుంది.

మెరుగైన సదుపాయాలు, ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ప్రయాణికులకు ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!